సీతారామం సినిమా సీక్వెల్ పై దుల్కర్ సల్మాన్ రియాక్షన్..!!

Divya

చాలాకాలం తర్వాత ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ప్రేమ చిత్రం సీతారామం. చిన్న సినిమాగా విడుదలై ఈ సినిమా ఒక ప్రభంజనాన్ని సృష్టించింది. డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది ఈ సినిమా ప్రశంసలు కూడా అందుకుంది. మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ బాలీవుడ్ హీరోయిన్ మృనాల్ ఠాగూర్ ఈ చిత్రంలో జంటగా నటించారు.అయితే ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో తెలుగు హీరోయిన్ రష్మిక కూడా నటించింది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమాని బాలీవుడ్ లో కూడా విడుదల చేశారు అక్కడ కూడా మంచి రెస్పాన్స్ లభించింది.

ఇక సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన ఈ సినిమా అమెజాన్ లో విడుదలై అక్కడ కూడా మంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఇందులోని పలు సన్నివేశాలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి ఇక ఇటీవల ముంబైలో సీతారామం సినిమా సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్రం బృందం. ఈ క్రమంలోనే సీతారామం సీక్వెల్ చేసే ఆలోచన ఉందా అని ప్రశ్న దుల్కర్ సల్మాన్ కు ఎదురయ్యింది.. దీంతో హీరో దుల్కర్ సల్మాన్ ఆసక్తికరమైన సమాధానాన్ని తెలియజేశారు.

సీతారామం సినిమా ఒక క్లాసికల్ సినిమా ప్రేక్షకులను నిజంగా నచ్చుతుందని ఒక నటుడిగా తనకు తెలుసని తెలియజేశారు దుల్కర్ సల్మాన్. అయితే ఇది ఒక ఇతిహాసం క్లాసికల్ సినిమా అవుతుందని మేము ముందుగానే గ్రహించాము.. అయితే మా ప్రయత్నం అనేది ప్రేక్షకులకు మెప్పిస్తుందా లేదా అనే సందేహంలో ఉండేది.. ఈ సినిమా కోసం మేము చాలా కష్టపడ్డాము. ఈ సినిమా పైన మీరు చూపించిన ప్రేమకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ సినిమా మళ్లీ మళ్లీ తీసేలాంటి సినిమా అని నేను అనుకోవడం లేదని తెలియజేశారు. ఈ చిత్రం 1960 లో ఒక రొమాంటిక్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం మంచి విజయం కావడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: