‘ఉప్పెన’సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్నాడు యంగ్ హీరో వైష్ణవ్ తేజ్. ఆయన పేరుకు తొలి నే అయినా ఎంతో పరిణితితో కూడిన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు.ఇకపోతే ఇండస్ట్రీలోకి గ్రాండ్ విక్టరీతో ఎంట్రీ ఇచ్చాడు.అయితే తొలితోనే భారీ క్రేజ్ను దక్కించుకున్న వైష్ణవ్ రెండో చిత్రం కొండ పాలెంలోనూ కమర్షియల్ జోలికి వెళ్లకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రను ఎంచుకొని తన ఎంపిక ఎలా ఉంటుందో మరోసారి చాటి చెప్పాడు.ఇదిలావుంటే ఈ యంగ్ హీరో ప్రస్తుతం నటిస్తోన్న ‘రంగ రంగ వైభవంగా’.కాగా కేతిక శర్మ హీరోయిన్గా నటిస్తోన్న ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయితే ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్లో భాగంగా గురువారం వైష్ణవ్ మీడియాతో ముచ్చటించారు. ఇక ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.అయితే ఒకే రకమైన జానర్ కథలను చేయాలని లేదన్న ఆయన, దారిలోకి వచ్చిన వాటిలో ఏ కథైతే ఉత్తేజపరుస్తుందో.. అది చేసుకుంటూ వెళ్లాలనుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. మెగా ఫ్యామిలీలో ఎవరి రీమేక్ చేస్తాన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘మామయ్యలు చిరంజీవి, పవన్ కల్యాణ్ల లు చూస్తూనే పెరిగాను. ఇకపోతే వాళ్లు చేసిన చిత్రాలను మళ్లీ టచ్ చేయాలని అసలు అనుకోను.అయితే ఒకవేళ ఎవరైనా వచ్చి ఇది బాగుంటుంది, నువ్వే చెయ్యాలి అంటే 'బద్రి' రీమేక్ చేయాలని ఉంది’ అని మనసులో మాట చెప్పేశాడు.
దీంతో వైష్ణవ తేజ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక పవన్ కెరియర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ గా బద్రి సినిమా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. టాలీవుడ్ డేరింగ్ అండ్ డాష్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ స్టైల్, మేనరిజం, యాటిట్యూడ్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి. దీంతో ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ రేంజ్ మారిపోయింది. అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాను వైష్ణవ తేజ్ రీమేక్ చేయాలని ఉంది అని చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది..
తొలి సినిమా తోనే భారీ విజయాన్ని అందుకున్న వైష్ణవ్ తేజ్ కెరీర్ను ‘రంగ రంగ వైభవంగా’ ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి..!!