రష్మి వల్లే సుధీర్ ఆ షో వదిలేసాడా?

praveen
ప్రస్తుతం తెలుగు బుల్లితెర పై సుధీర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ అనే కార్యక్రమంలో ఒక సాదా సీదా కమెడియన్గా ఎంట్రీ ఇచ్చిన సుడిగాలి సుదీర్ తక్కువ సమయంలోనే స్టార్ కమెడియన్ గా మారిపోయాడు అని చెప్పాలి. ప్రస్తుతం జబర్దస్త్ లో ఉన్న టాప్ టీం లీడర్లలో సుధీర్ కూడా ఒకరు. మరిముఖ్యంగా సుడిగాలి సుదీర్ రష్మి తో లవ్ ట్రాక్ నడపడం ఎంతగానో కలిసొచ్చింది. ఈ లవ్ ట్రాక్ కారణంగానే బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడూ. ఇక వీరిద్దరి జోడి బుల్లితెరపై  ఎప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.

 సుధీర్ రష్మీ కలిసి ఎక్కడైనా కనిపించారూ అంటే చాలు వాళ్లను చూసిన ప్రేక్షకులు అందరూ కూడా ఎంతగానో మురిసిపోతూ ఉంటారు. సుధీర్ రష్మీ పెళ్లి చేసుకుంటే చూడాలని ఎంతో మంది కోరుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఇటీవలి కాలంలో మాత్రం సుడిగాలి సుధీర్ రష్మీ కలిసి ఎక్కడ ఈ టీవీ షోలలో కనిపించడంలేదు. మరీ ముఖ్యంగా ఢీ షో మానేసినా సుడిగాలి సుదీర్ క్రమక్రమంగా ఈటీవీ లోని అన్ని కార్యక్రమాలకు కూడా దూరమవుతూ వస్తున్నాడు. ఇక ఇటీవలే స్టార్ మా లో ప్రసారమయ్యే పాటలు కార్యక్రమానికి యాంకర్ గా అవతారమెత్తాడు సుడిగాలి సుదీర్.

 అదే సమయంలో అటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం నుంచి కూడా సుధీర్ తప్పుకున్నాడు అన్నది తెలుస్తుంది. ఇటీవల విడుదలైన ప్రోమోలో సుధీర్ కాకుండా రష్మీ యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది. కాగా యాంకర్ రష్మి ఆది మధ్య సంభాషణ జరుగుతున్న సమయంలో నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా అంటూ యాంకర్ రష్మీ అంటుంది. అయ్యో బాగా తెలుసు కామెడీ షో మానేసి పాటల ప్రోగ్రాం కు వెళ్లాల్సి వస్తుంది అంటూ చెబుతాడు ఆది. దీంతో రష్మి కారణంగానే సుధీర్ ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ మానేశాడా.. రష్మి కారణంగానే ఈ టీవీ కి దూరమవుతున్నాడా అన్న చర్చ మొదలయింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: