సమంత హద్దులు దాటుతోంది..!
సమంత బాలీవుడ్కి వెళ్తోంది. హిందీ సినిమాలు చేస్తుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. 'ఫ్యామిలీమెన్2' సీరీస్ వచ్చినప్పటి నుంచి సమంతకి బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్స్ వచ్చాయనే వార్తలొస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఆ వివరాలు బయటకు చెప్పలేదు. కానీ ఇప్పుడు అక్షయ్ కుమార్తో కలిసి ఒక సినిమా చేయబోతోందనే ప్రచారం జరుగుతోంది. కుమార్ మంగత్ నిర్మాణంలో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది.
సమంత కొన్నాళ్ల వరకు కమర్షియల్ మూవీస్కి దూరంగా ఉండేది. నాగచైతన్యతో పెళ్లయ్యాక ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ మూవీస్లోనే నటించింది. హీరోయిన్ సెంట్రిక్ స్టోరీస్కే ఓకే చెప్పింది. అయితే చైతన్యతో విడిపోయాక మళ్లీ కెరీర్లో బిజీ కావాలనుకుంటోందట సామ్. అందుకే రెగ్యులర్ హీరోయిన్ రోల్స్కి కూడా ఓకే చెప్తోందని ప్రచారం జరుగుతోంది. కంప్లీట్ బిజీగా ఉండడానికి అక్షయ్తో సినిమాకి ఓకే చెప్పిందట సామ్.
సమంత ప్రస్తుతం 'శాకుంతలం, యశోద' సినిమాలతో బిజీగా ఉంది. వీటిల్లో 'శాకుంతలం' సినిమా రిలీజ్కి రెడీ అయితే, 'యశోద' సెట్స్లో ఉంది. ఈ రెండు సినిమాలు మల్టీలింగ్వల్గా విడుదల కాబోతున్నాయి. అలాగే నయనతార, విజయ్సేతుపతితో కలిసి 'కాథువాకుల రెండు కాదల్' చేస్తోంది. వీటితోపాటు హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ జాన్ ఫిలిప్ దర్శకత్వంలో 'ఎరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్' సినిమాకి కమిట్ అయ్యింది. ఈ ప్రాజెక్ట్స్ తర్వాత అక్షయ్ కుమార్తో సినిమా చేస్తుందట సమంత.
మరోవైపు సమంత పాత రూల్స్ అన్నిటిని బ్రేక్ చేస్తోంది. ఇన్నాళ్లు నొ రొమాన్స్ ఓన్లీ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ అన్నట్టుగా ఉన్న సామ్, ఈ సర్కిల్ నుంచి బయటకొస్తోంది. డివోర్స్ తర్వాత కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తోన్న సమంత మళ్లీ కమర్షియల్ హీరోయిన్ రోల్స్కి ఓకే చెప్తోంది. బాలీవుడ్లో భారీ అవకాశం కూడా అందుకుందట.