కోలార్ సిటీ పై KGF యష్ తల్లి ఆసక్తికర వ్యాఖ్యలు..!!

Divya
కే జి ఎఫ్ సినిమా లో హీరో యష్ తల్లి పాత్ర గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాకు ఈమె పాత్ర ఆత్మ లాంటిది. ఇకపోతే అర్చన మొదటిసారి స్టార్ సువర్ణ ఛానల్ లో ప్రసారమైన దుర్గా అనే సీరియల్ ద్వారా తొలిసారిగా కనిపిం చడం జరిగింది. ఆ తరువాత మహా దేవి సీరియల్ లో కూడా అర్చన చూసిన కే జి ఎఫ్ టీమ్ ఈమెను తల్లి పాత్ర కోసం సంప్రదింపులు జరిపిందట. ఇకపోతే కేజిఎఫ్ సినిమా గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే ఈ సినిమాకు మదర్ సెంటిమెంట్ అనేది చాలా ప్రాముఖ్యతను అందించింది.
మదర్ సెంటిమెంట్ తోనే సినిమా కథ మొత్తం తిప్పాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కే జి ఎఫ్ సినిమా లో రాఖీ బాయ్ తల్లిగా నటించిన అమ్మాయి పేరు అర్చన జోయిస్. అర్చన సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యి తన నటనతో అందరినీ మెప్పించింది. చిన్న వయసులో అయినప్పటికీ హీరో యష్ కి తల్లి పాత్రకు అడగడంతో ఆమె ఏమాత్రం వెనుకడుగు వేయకుండా పాన్ ఇండియా సినిమా అని ఓకే చెప్పింది. ఇక ఈ సినిమా ద్వారా ఆమె ఊహించిన కంటే ఎక్కువగానే గుర్తింపు రావడం గమనార్హం.
ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అర్చన తనకు సంబంధించిన అనేక విషయాలను గురించి కూడా కొన్ని విషయాలను తెలిపింది. అర్చన తల్లిదండ్రులు శ్రీనివాస్, వీణ. వీరిద్దరూ కూడా టీచర్లు కావడం గమనార్హం. అర్చన తల్లిది ఈ సినిమా కథతో తీసిన కోలార్ ప్రాంతం . అర్చన పుట్టి పెరిగింది కూడా కోలార్ లోనే అంటూ ఇంటర్వ్యూలో తెలిపింది. ఇక అర్చన ఫైన్ ఆర్ట్స్లో పీజీ కూడా పూర్తి చేసింది. ఇక ఈమెకు  ఒక చెల్లెలు కూడా ఉంది అని,  ఆమెకు తెలుగు హీరోలు అంటే చాలా ఇష్టం అని కూడా చెప్పుకొచ్చింది. ఇక రామ్ చరణ్ , అల్లు అర్జున్,  ప్రభాస్,  ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం అని తెలిపింది అర్చన.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: