క్రేజీ బ్యానర్ నుండి ఆఫర్ అందుకున్న సిద్దు జొన్నలగడ్డ..!

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సిద్ధు జొన్నలగడ్డ టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు టాకీస్ మూవీ తో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నడు.  ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ సరసన రష్మి గౌతమ్ హీరోయిన్ గా నటించింది.  ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపకపోయినప్పటికీ నటన పరంగా గుంటూరు టాకీస్ మూవీ సిద్ధు జొన్నలగడ్డ  కు మంచి గుర్తింపు తీసుకువచ్చింది . ఆ తర్వాత జొన్నలగడ్డ నటించిన కృష్ణ అండ్ హిస్ లీలా , మా వింత గాధ వినుమా సినిమాలు కూడా సిద్ధు జొన్నలగడ్డ కు మంచి క్రేజ్ ను తీసుకు వచ్చాయి.

  ఇది ఇలా ఉంటే తాజాగా సిద్దు జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.  డీజే టిల్లు సినిమాతో సిద్ధు జొన్నలగడ్డ టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోగా మారిపోయాడు.  ఇది ఇలా ఉంటే డీజే టిల్లు  సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోగా మారిపోయిన సిద్ధు జొన్నలగడ్డ  కు ఒక స్టార్ ప్రొడక్షన్ హౌస్ నుండి అదిరిపోయే బంపర్ ఆఫర్ వచ్చినట్లు  ఒక వార్త వైరల్ అవుతుంది.  సిద్ధు  జొన్నలగడ్డ కు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బంపర్ ఆఫర్ ఇచ్చాడు ఇచ్చారట.  స్వతహాగా రైటర్ అయినా సిద్దు జొన్నలగడ్డ ను తన దగ్గరకు వచ్చి కలవాలి అని ,  కథ ఓకే అయితే ఇమీడియట్ గా సినిమా చేద్దాము అని దిల్ రాజు , సిద్ధు జొన్నలగడ్డ కు కమిట్మెంట్ ఇచ్చాడట.  ఇలా దిల్ రాజు  బంపర్ ఆఫర్ ఇవ్వడంతో సిద్ధు జొన్నలగడ్డ ఒక కొత్త పాయింట్ తో స్టోరీ రాసేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది.  ఇలా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నుండి సిద్దు జొన్నలగడ్డ కు క్రేజీ ఆఫర్ వచ్చినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: