షాకింగ్ : రోజా భర్త సెల్వమణి పై అరెస్ట్ వారెంట్?

praveen
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నగరి ఎమ్మెల్యే గా ఇక తెలుగు బుల్లితెర ప్రేక్షకులందరికీ కూడా జబర్దస్త్ జడ్జిగా కొనసాగుతుంది రోజా. ఇక ఒకప్పుడు హీరోయిన్గా రాణించి కోట్ల మంది అభిమానులను సంపాదించుకుంది. రోజా భర్త ఆర్కే సెల్వమణి కి  కూడా సోషల్ మీడియాలో అదే రేంజిలో క్రేజ్ ఉంది. ఎందుకంటే తమిళ చిత్ర పరిశ్రమలో మంచి దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు సెల్వమణి. ఇక వీరిద్దరికీ సంబంధించిన ఏదైనా విషయం సోషల్ మీడియాలోకి వచ్చింది అంటే చాలు అది క్షణాల్లో వైరల్ గా మారిపోతూ ఉంటుంది.

 ఇక ఇప్పుడు ఎమ్మెల్యే జబర్దస్త్ జడ్జి రోజా భర్త ఆర్కే సెల్వమణి గురించి ఒక షాకింగ్ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆర్కే సెల్వమణి పై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది అంటూ వార్త చక్కర్లు కొడుతోంది. పరువు నష్టం కేసు విచారణకు హాజరు కాకపోవడంతో నే ఇలా అరెస్టు వారెంట్ జారీ అయినట్లు తెలుస్తోంది.  చెన్నై జార్జి టౌన్ కోర్టు ఈ వారెంట్ ఇచ్చిందట. ఆర్కే సెల్వమణి దక్షిణ భారత చలనచిత్ర కార్మిక సంఘాల సమ్మేళనం అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు.

 అయితే 2016లో సెల్వమణి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అరుల్ అన్బరుసు ఒక టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే ఫైనాన్షియర్ ముకుంద చంద్ బొద్రా గురించి కూడా కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే బొద్రా  కోర్టులో సెల్వమణి తో పాటు ఎమ్మెల్యే అరుల్  పైన కూడా నష్టం దావా వేశారు. ఇక బొద్రా మరణించిన తర్వాత ఆయన కుమారుడు ఈ కేసును కొనసాగిస్తున్నారు. అయితే కోర్టులో మంగళవారం విచారణకు ఆర్కే సెల్వమణి  హాజరుకావాల్సి ఉంది. కానీ కోర్టు ముందు హాజరు కాలేదు. ఆయన తరపు న్యాయవాదులు సైతం రాలేదు. దీంతో న్యాయమూర్తి వారిద్దరిపై అరెస్టు వారంట్ జారీ చేయడం సంచలనంగా మారింది. కేసు తదుపరి విచారణ  ఈ నెల 23వ తేదీకి వాయిదా వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: