ప్రశాంత్ నీల్ ను ఫాలో అవుతున్న కొరటాల శివ..!!
మిర్చి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన కొరటాల శివ తొలి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకుని అగ్ర దర్శకుల జాబితాలో చేరిపోయాడు. తనకు దర్శకత్వం రాదు అని తెలిసినా కూడా అవకాశం ఇచ్చిన ప్రభాస్ ను మెచ్చుకోవాలో లేదా తనకు కథ మీద బాగా పట్టు ఉందని నమ్మకంతో ఈ సినిమా చేసిన కొరటాల శివను మెచ్చుకోవాలో తెలియడం లేదు కానీ వీరిద్దరి నమ్మకం నిలబడి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనం చూశాం. అలా తొలి సినిమా విజయం సాధించిన తర్వాత మహేష్ బాబు ఈ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు. శ్రీమంతుడు సినిమా కూడా సూపర్ హిట్ చేసి కొరటాల శివ ఫుల్ ఫామ్ లోకి వచ్చేశాడు.
ఆ తరువాత ఎన్టీఆర్ తో సినిమా చేసి ఘన విజయం సాధించుకొని ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేశాడు. తొందర్లోనే ఈ చిత్రం విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా తర్వాత ఆయన ఎన్టీఆర్ చేయబోయే సినిమా విషయంలో ప్రశాంత్ నీల్ పద్ధతి వ్యవహరించబోతునట్లు తెలుస్తోంది. హీరో ఎలివేషన్ భారీ స్థాయిలో ఇవ్వడం ప్రశాంత్ ప్రత్యేకత. తన సినిమాలో కాన్సెప్ట్ కి ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చే కొరటాల తొలిసారిగా హీరో బాగా హైలెట్ అయ్యే విధంగా ఆ పాత్ర చిత్రీకరణ చేయబోతున్నాడట. మరి ఇది ఆయన కెరియర్ కు ఏవిధంగా ఉపయోగపడుతుందో చూడాలి.