కరోనా కు భయపడి అనుష్క వెనకడుగు !

Seetha Sailaja

‘బాహుబలి’ లాంటి చరిత్ర సృష్టించిన సినిమాలో నటించినప్పటికీ అనుష్క కెరియర్ కు ఎలాంటి టర్నింగ్ పాయింట్ రాలేదు. ఆతరువాత ఆమె ‘భాగమతి’ ‘నిశ్శబ్దం’ సినిమాలలో నటించినప్పటికీ ఆ రెండు సినిమాలు ఆమె కెరియర్ కు ఎలాంటి సహాయం చేయలేక పోవడంతో ఆమె తన ఇంటికే పరిమితం అయిపోయింది.

ఇలాంటి పరిస్థితులలో యూవీ క్రియేషన్స్ సంస్థ ‘జాతిరత్నాలు’ ఫేమ్ నవీన్ పోలిశెట్టి ని హీరోగా చేసి నిర్మించబోతున్న మూవీలో అనుష్క ను హీరోయిన్ గా ఒప్పించడానికి చాల కష్టపడవలసి వచ్చింది అంటారు. తన కంటే వయసులో చిన్న వాడైన నవీన్ పోలిశెట్టి తో అనుష్క నటించడానికి అంగీకరించక పోవడంతో యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ విషయంలో అనుష్కను ఒప్పించడానికి చాలగట్టి ప్రయత్నాలు చేయడమే కాకుండా ఆమెకు 2 కోట్ల పారితోషికం ఆఫర్ చేసారు అన్నవార్తలు కూడ వచ్చాయి.

చివరకు ఏదోవిధంగా ఒప్పుకున్న అనుష్క ఈమూవీ షూటింగ్ ను జనవరి నెలాఖరు నుండి మొదలుపెట్టుకోమని ఈమూవీ నిర్మాతలకు సూచించింది అన్నమాటలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు మళ్ళీ కరోనా థర్డ్ వేవ్ ప్రారంభం కావడంతో తాను ఇప్పట్లో ఈమూవీ షూటింగ్ కు రానని పరిస్థితులు చక్కపడ్డాక మాత్రమే తాను ఈమూవీ సెట్ లోకి వస్తానని చెప్పినట్లు తెలుస్తోంది.

కరోనా థర్డ్ వేవ్ ప్రారంభం అయినప్పటికీ అనేక సినిమాల షూటింగ్ లు కొనసాగుతూనే ఉన్నాయి. అనేకమంది హీరోలు హీరోయిన్స్ ఈ పరిస్థితులకు భయపడకుండా షూటింగ్ లకు వస్తున్నారు. అనుష్క ఈ సాకుతో ఈమూవీ ప్రాజెక్ట్ కు బ్రేక్ వేసిందా లేదంటే నిజంగానే అనుష్క కరోనా పరిస్థితులకు భయపడుతోందా అంటూ కొందరు సందేహాలు వ్యక్తి పరుస్తున్నారు. ఇప్పటివరకు ఇండస్ట్రీలో టాప్ హీరోలతో నటించిన అనుష్క ఒక యంగ్ హీరోతో నటించే విషయంలో ఆమె పూర్తిగా సరిపెట్టుకోలేకపోతోంది అనుకోవాలి. యంగ్ డైరెక్టర్ మహేష్ వ్రాసిన ఈకథలో వయసులో పెద్దది అయిన అనుష్క ను ఒక యువకుడు ప్రేమించే కథ అని అంటున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: