మహేష్ - నమ్రత గురించి మీకు తెలియని నిజాలివే..??

N.ANJI
తెలుగు చిత్ర పరిశ్రమలో చూడ ముచ్చటైన జంటలలో సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత ఒక్కరు. వీరిద్దరూ ఇండస్ట్రీలో హీరోహీరోయిన్లుగా పరిచయమైన ఈ ఇద్దరూ లవ్ ట్రాక్ నడిపించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. వీరిద్దరూ పెళ్లి తరువాత ఎలాంటి మనస్పర్థలకు తావివ్వకుండా వైవాహిక జీవితం సంతోషంగా గడుపుతున్నారు. అంతేకాదు.. వీరిద్దరూ సెలబ్రిటీ కపుల్ హోదాలో టాలీవుడ్ ఇండస్ట్రీ లోనే గాక సౌత్ సినీ ఇండస్ట్రీ మొత్తంలో మోస్ట్ క్రేజీ జోడీగా గుర్తింపు తెచ్చుకున్నారు. మహేష్ బాబు కాస్త సమయం దొరికిన దొరికినా ఫ్యామిలీ ట్రిప్స్ వేస్తూ సూపర్ స్టార్ అభిమానులకు స్పెషల్ కిక్కివ్వడం ఈ జోడీ అలవాటుగా మారింది.
మహేష్ బాబు, నమ్రత 2000 సంవత్సరంలో 'వంశీ' సినిమాతో మొదటిసారి కలుసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు. అంతేకాదు.. వీరిద్దరూ కొన్నేళ్లపాటు లవ్ ట్రాక్ నడిపించి చివరకు పెద్దల అంగీకారంతో మూడు ముళ్ల బంధంతో అతికొద్ది మంది సమక్షంలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇక 2005 సంవత్సరంలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు మోస్ట్ క్రేజీ కపుల్‌గా కలర్‌ఫుల్ లైఫ్ ఆస్వాదిస్తున్నారు. వారి వివాహ బంధంలో  ఎన్నో అపురూమైన జ్ఞాపకాలు ఏర్పర్చుకున్న ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
నమ్రత పెళ్లి తరువాత ఇండస్ట్రీకి దూరమై కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ ఉంది. వారిద్దరి ప్రేమ గురించి నమ్రత ఓ ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చారు. మహేష్ బాబు, నమ్రత వంశీ' సినిమా సమయంలోనే ఒకరినొకరం ఇష్టపడ్డామని, అయిదు సంవత్సరాల పాటు డేట్‌లో ఉన్నామని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. వీరిద్దరూ రెండేళ్ల తర్వాత తమ ప్రేమ బంధాన్ని సీరియస్‌గా తీసుకొని పెళ్లికి రెడీ అయ్యామని తెలిపారు. అయితే మొదటిసారి మహేష్‌ని చూసినప్పుడే ప్రత్యేకమైన అనుభూతి కలిగిందని, ఓ ఇన్నోసెంట్ అనిపించిందని, అయన ఇచ్చిన మర్యాదకు ఫిదా అయ్యానని నమ్రత పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: