అందాల ముద్దు గుమ్మ అనుష్క తెలుగు నాట స్టార్ హీరోల సరసన నటించి టాలీవుడ్ అగ్ర కథానాయకుల స్థానానికి ఎదిగింది. అనుష్క కేవలం కమర్షియల్ సినిమాలలో అంద చందాలతో మాత్రమే కాకుండా అరుంధతి లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా కనిపించి ఎం తో మంది తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. అటు కమర్షియల్ సినిమాలతో ఇటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న అనుష్క గత కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజా గా అనుష్క పుట్టిన రోజు సందర్భంగా నవంబర్ 7 వ తేదీన తన తో హైడ్రిక్ సినిమా చేయబోతున్నట్లు యు వి క్రియేషన్స్ సంస్థ తెలిపింది. ఇప్పటికే యూవీ క్రియేషన్స్ సంస్థ అనుష్క తో మిర్చి, భాగమతి సినిమాలను నిర్మించింది. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించాయి.
యువి క్రియేషన్స్ బ్యానర్ తమ సంస్థలో అనుష్క చేసిన రెండు సినిమాల గురించి ప్రస్తావిస్తూ మూడో సినిమా గురించి తెలియజేస్తూ ఒక వీడియోను బయటకు వదిలింది. అనుష్క తో యు వీ క్రియేషన్స్ చేయబోయే మూడో మూవీ ని రా రా కృష్ణయ్య ఫేమ్ మహేశ్ బాబు.పి తెరకెక్కించబోతున్నారు. ఇన్ని రోజులు ఈ మూవీ కి సంబంధించి అనధికార వార్తలు వినిపిస్తూనే వచ్చాయి. ఎట్ట కేలకు యు వి క్రియేషన్స్ అనుష్క తో చేయబోయే సినిమా గురించి ప్రకటన చేసింది. ఈ మూవీ లో నవీన్ పొలిశెట్టి హీరో గా నటించబోతున్నారని, ఎక్కువ వయసు ఉండే అమ్మాయి, తక్కువ వయసు ఉండే అబ్బాయి మధ్య ప్రేమ పుట్టినప్పుడు వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు కలిగాయి. వారికి ఎలాంటి సమస్యలు వచ్చాయి, వాటిని వారు ఎలా అధిగమించారు అ నే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతోంది అని వార్తలు వస్తున్నాయి.