ఆస్కార్ పోటీలో ఆ నాలుగు సినిమాలు ?
అయితే ఈ ఏడాదిగి సంబంధించి 2022 బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ విభాగంలో మన దేశం నుంచి అధికరికంగా ఏంట్రి కోసం ప్రస్తుతం నాలుగు సినిమాలు పోటీ పడుతున్నాయి. ఈ సినిమాలను కేంద్ర ప్రభుత్వం 15 మంది సభ్యులతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జ్యూరీ పరిశీలిస్తుంది. ఈ సినిమా ల నుంచి ఒక సినిమా ను ఆస్కార్ నామినేషన్ కు పంపిస్తారు. అయితే వీటి కోసం ముఖ్యం గా నాలుగు సినిమాలు పోటీ పడుతున్నాయి. హింది నుంచి సర్దార్ ఉదమ్ తో పాటు షేర్నీ సినిమాలు పోటీలో ఉన్నాయి. వీటి తో పాటు మండేలా అనే తమిళ చిత్రం, నాయట్టు అనే మలయాళ సినిమా కూడా ముఖ్యం గా ఏంట్రీ కోసం పోటి పడుతున్నాయి. అయితే ఈ నాలుగు సినిమాల నుంచి ఏ సినిమా ను ఆస్కార్ కు జ్యూరీ నామినేషన్ చేస్తుందో చూడాలి మరి.