మానిఫెస్టో ప్రకటించిన సివి ఎల్ నరసింహారావు !

Veldandi Saikiran
మా  అసోషియేషన్‌ అధ్యక్ష ఎన్నికలు చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోన్న సంగతి మనకు తెల్సిందే. అయితే.. తాజాగా తన మానిఫెస్టో ను ప్రకటించేశారు  సి వి ఎల్ నరసింహా రావు.  మా ఎన్నికల లో అధ్యక్ష పదవికి సి వి ఎల్ నరసింహా రావు పోటీ చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో నే తాజాగా తన మానిఫెస్టోను విడుదల చేశారు సి వి ఎల్ నరసింహా రావు. 2011 ఏడాది లో మనం పాస్ చేసుకున్న రిజల్యూషన్ ను పర్ఫెక్ట్ గా అమలు చేయడం తమ ముఖ్య ఉద్దేశ్యమని ప్రకటించారు సి వి ఎల్ నరసింహా రావు.. ఇది కనుక అమలు అయితే ఆర్టిస్టుల అందరికీ అవకాశాలు వస్తాయి.. ఈ రిజల్యూషన్ పాస్ చేసినప్పుడే 50 మంది సభ్యుల తో కమిటీ ఏర్పాటు చెయ్యాలి అనుకున్నామని స్పష్టం చేశారు సి వి ఎల్ నరసింహా రావు. 

వాళ్ల పేర్లు త్వరలో. ఎనౌన్స్ చేస్తాను... హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి మా సభ్యుడికి 3లక్షల రూపాయలు సంవత్సరానికి వుండేలా ఆ అమౌంట్ మా కడుతుందని తెలిపారు సి వి ఎల్ నరసింహా రావు. అది వచ్చే జనవరి నుంచి అమలు చేస్తామని...  ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ లో మా మెంబర్ కి అసోసియేట్ మెంబర్ షిప్ సంపాదించడమని స్పష్టం చేశారు సి వి ఎల్ నరసింహా రావు.. పెన్షన్ ప్రస్తుతం 6 వేలు ఇస్తున్నారు..  ఈ నవంబర్ నుంచి అది 10 వేలు ఇచ్చేలా చెయ్యడమే తన లక్ష్యమన్నారు సి వి ఎల్ నరసింహా రావు.

 
ఆడవాళ్ళ కు ఉపయోగ పడే ఆసరా ను 20 ఏళ్లు క్రితం పెట్టాము... దాన్ని  మళ్ళీ ఇప్పుడు రివైవ్ చేయడమే లక్ష్యంగా ముందుకు వెళతామని ప్రకటించారు సి వి ఎల్ నరసింహా రావు. ఆసరా కమిటీ లో వుండే 13 మంది పేర్లను త్వరలోనే ఎనౌన్స్ చేస్తాననని... ఎవరైనా మా సభ్యుడు  ఆకలి భాధలు పడుతుంటే అతను కాల్ చేసినా రెండు గంటలలో అతని ఇంటికి నెల రోజుల సరిపడా గ్రాసరి నీ పంపిస్తామని హామీ ఇచ్చారు సి వి ఎల్ నరసింహా రావు. రెండు మూడు రోజుల్లో మీడియా ముందుకు వస్తానని.... అన్ని వివరాలు చెబుతానని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: