పాన్ ఇండియా డైరెక్టర్ ని విసిగిస్తున్న శృతిహాసన్..!

Pulgam Srinivas
ముద్దుగుమ్మ శృతిహాసన్ తెలుగు లో గబ్బర్ సింగ్ , ఎవడు , రేసుగుర్రం , శ్రీమంతుడు , కాటమ రాయుడు వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించే తెలుగులో స్టార్ హీరోయిన్ స్థానానికి ఎదిగింది. ఆ తర్వాత ప్రేమ వ్యవహారాలతో కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్న శృతి హసన్ రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 'క్రాక్' సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'వకీల్ సాబ్' సినిమాతో మరోసారి ఈ సంవత్సరం బ్లాక్ బాస్టర్  ని అందుకుంది. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ 'కేజీఎఫ్' సినిమా తో పాన్ ఇండియా దర్శకుడిగా మారిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న 'సలార్' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సందర్భంలో 'సలార్' సెట్స్‌ లో సరదాగా ఎంజాయ్ చేసిన ఓ వీడియోను షేర్ చేసి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది శృతి హాసన్. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే శృతిహాసన్ 'సలార్' షూటింగ్ సెట్ లో డైరెక్టర్ ప్రశాంత్ నిల్ ని ఆటపట్టిస్తూ ఉన్నట్లు ఉన్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నాకిష్టమైన పని చేస్తూ నాకిష్టమైన డైరెక్టర్‌ని ఏడిపిస్తున్నా, ఆయనకు విసుగు తెప్పిస్తున్నా అంటూ ఈ వీడియో ను శృతి హాసన్ పోస్ట్ చేసింది. ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న శృతి హాసన్ ఈ మధ్య తనకు ఎంతో ఇష్టమైన ఫుడ్ బిజినెస్ లో ఎంటర్ కాబోతున్నట్లు కూడా తెలియజేసింది. ముంబాయి లో ఉండే సౌత్ ఇండియన్ ప్రజల కోసం ఒక సౌత్ ఇండియన్ రెస్టారెంట్ ను ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు శృతిహాసన్ తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: