పాన్ ఇండియా మార్కెట్ పై కన్నువేసిన దిల్ రాజు..!

Pulgam Srinivas
తెలుగు ప్రముఖ నిర్మాత దిల్ రాజు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సినిమాలు నిర్మిస్తూ అదే క్రమంలో చిన్న హీరోలు మరియు కొత్త హీరోలకు కూడా చాన్స్ లు ఇస్తూ తన నిర్మాణ సంస్థ ను ముందుకు తీసుకువెళ్తున్నాడు. అయితే ప్రస్తుతం దిల్ రాజు కేవలం టాలీవుడ్ పై మాత్రమే కాకుండా తన దృష్టిని పాన్ ఇండియా పై పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దిల్ రాజు, రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకుడిగా పాన్ ఇండియా రేంజ్ లో ఒక సినిమాను నిర్మిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ప్రారంభోత్సవ వేడుక కూడా ఈ మధ్యనే జరిగింది.

ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో  దిల్ రాజు నిర్మించబోతున్నాడు. ఇలా రామ్ చరణ్, శంకర్ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో తన సినిమాలను విడుదల చేసే ప్లాన్ లో ఉన్న దిల్ రాజు ఇంతలోనే 2020  లో విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ థ్రిల్లర్ HIT - ది ఫస్ట్ కేస్  హిందీ రీమేక్ ని నేటి ఉదయం అధికారికంగా ప్రారంభించారు. చిత్ర హీరో రాజ్కుమార్ రావు దర్శకుడు డాక్టర్ శైలేష్ కొలను నిర్మాతలు దిల్ రాజు భూషణ్ కుమార్ ఈ సినిమా లాంచింగ్ వేడుకలో పాల్గొన్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ముంబాయిలో ప్రారంభం కానుంది. ఇదిఇలా ఉంటే ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్ లో ఫుల్ మార్కెట్ ను సంపాదించుకున్న ప్రభాస్ హీరోగా కూడా దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఒక పాన్ ఇండియా సినిమాను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. దిల్ రాజు నిర్మాతగా ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సినిమా షూటింగ్  2023 వ సంవత్సరంలో ప్రారంభిస్తారు అంటూ కూడా ఫిల్మీ దునియా లో గుసగుసలు వినబడుతున్నాయి. ఇలా దిల్ రాజు వరుస పాన్ ఇండియా సినిమాలతో జాతీయ మార్కెట్ పై కన్నువేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: