మహేష్ మూవీ కోసం హాలీవుడ్ టీమ్ ని దింపుతున్న జక్కన్న... ??

GVK Writings
టాలీవుడ్ దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి ఏదైనా సినిమా తీయడం మొదలెట్టారు అంటే దాని గురించి ప్రతి ఒక్క అంశాన్ని ఎంతో నిశితంగా పరిశీలించి కానీ ముందుకు సాగరు అని పలువురు సినిమా ప్రముఖులు, అలానే ఆయన టీమ్ లో పని చేసిన వారు చెప్తూ ఉంటారు. ఆ విధంగా తన సినిమాల గురించి ముందుగానే ఎంతో గొప్ప విజన్ రాజమౌళి కి ఉంటుందని, అందుకే ఆయన వరుసగా సక్సెస్ లు కొడుతూ దూసుకెళ్తున్నారని అంటున్నారు. ఇక ప్రస్తుతం చరణ్, ఎన్టీఆర్ లతో ఆయన రౌద్రం రణం రుధిరం సినిమాని ఎంతో గ్రాండ్ లెవెల్లో తీస్తున్న విషయం తెలిసిందే.
ఎన్టీఆర్ కొమురం భీం గా చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం ఇటీవల పూర్తి అయింది. రాబోయే ఆక్టోబర్ లో విడుదల కావలసిన తమ సినిమాని ప్రస్తుత కరోనా అలానే థియేటర్ టికెట్ రేట్స్ పరిస్థితుల దృష్ట్యా కొన్నాళ్ల పాటు వాయిదా వేస్తున్నాం అని, త్వరలో తదుపరి విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తాం అని ఆర్ఆర్ఆర్ మేకర్స్ తెలిపారు. కాగా ఈ మూవీ సంక్రాంతి బరిలో నిలిచే ఛాన్స్ కూడా లేకపోలేదని అంటున్నారు పలు టాలీవుడ్ వర్గాలు. ఇక ఈ మూవీ తరువాత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ తో తన నెక్స్ట్ సినిమా చేయనున్నారు రాజమౌళి. ప్రస్తుతం ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ క్రేజీ కాంబో మూవీ కోసం మంచి స్టోరీ సిద్ధం చేస్తున్నారు.
ఈ మూవీ కోసం సౌత్ ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగె ఎడ్వెంచరస్ బ్యాక్ డ్రాప్ స్టోరీ ని తీసుకునే ఛాన్స్ ఉందని ఇటీవల విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ చెప్పారు. అయితే ఇంతటి భారీ సినిమాని ఏ విషయంలోను కాంప్రమైజ్ కాకుండా పక్కగా తన గత సినిమాలని మించేలా అద్భుతంగా తీయాలని ఆలోచన చేస్తున్నారట రాజమౌళి. అందుతున్న పలు సినిమా వర్గాల సమాచారం ప్రకారం ఈ మూవీ ఇండియన్ మూవీ హిస్టరీ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందనుండగా, ఎంతో మంది హాలీవుడ్ టీమ్ ఈ సినిమాకి సంబంధించి పలు క్రాఫ్ట్స్ లో పనిచేయనున్నారని అంటున్నారు. ఇప్పటికే ఈ మూవీ కోసం నిర్మాత కేఎల్ నారాయణ, హీరో మహేష్ లతో చిన్న డిస్కషన్ చేసిన రాజమౌళి, వచ్చే ఏడాది ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. మరి దీనిని బట్టి చూస్తుంటే సూపర్ స్టార్ తో సూపర్ డైరెక్టర్ రాజమౌళి తీయనున్న సినిమా అలా ఇలా కాదు సుమీ, ఎవరూ ఊహించని మరొక రేంజ్ లో ఉంబోతున్నట్లు తెలుస్తోందని అంటున్నాయి సినీ వర్గాలు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: