మరొక వారం అక్కడే మకాం వేయనున్న ప్రభాస్ ... ??

GVK Writings
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలను ఒకదాని తరువాత మరొకటి పక్కా ప్లానింగ్ తో పూర్తి చేస్తూ కెరీర్ ని ఎంతో జాగ్రత్తగా చేసుకుంటూ కొనసాగుతున్నారు. ఇప్పటికే ఆయన నటిస్తున్న రాధేశ్యామ్ మూవీ షూట్ మొత్తం కొన్నాళ్ల క్రితం పూర్తి చేసుకోగా, ప్రస్తుతం దాని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు యూనిట్ సభ్యులు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్.
అయితే దీనితో పాటు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తో ఆదిపురుష్, నాగ అశ్విన్ తో ప్రాజెక్ట్ కె, అలానే కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సలార్ సినిమాలు కూడా చేస్తున్నారు ప్రభాస్. కాగా వీటిలో ప్రభాస్ చేస్తున్న సలార్ పై ఆయన ఫ్యాన్స్ లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. దానికి కారణం ఆ మూవీ దర్శకుడు ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ సినిమాతో మాస్, యాక్షన్ డైరెక్టర్ గా విపరీతమైన క్రేజ్ దక్కించుకోవడమే. కాగా ఈ సలార్ మూవీ కూడా భారీ స్థాయి యక్షన్ హంగులతో అలానే పక్కాగా కమర్షియల్ అంశాల మేళవింపుగా తీస్తున్నారట ప్రశాంత్. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ మూవీ ఎంతో గ్రాండ్ గా నిర్మితం అవుతుండగా శృతి హాసన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.
మ్యాటర్ ఏమిటంటే, నేడు ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ ని హైదరాబాద్ లో యూనిట్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. కొన్ని భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ షెడ్యూల్ లో తీయనున్నారని, దాదాపు ఇక్కడే వారానికి పైగా షూట్ చేసిన అనంతరం బెంగళూరు లో తదుపరి షెడ్యూల్ నిర్వహించనున్నట్లు టాక్. దానిని బట్టి ప్రభాస్ సలార్ కోసం వారం పాటు హైదరాబాద్ లోనే మకాం వేయనున్నట్లు తెలుస్తోంది. వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు. మరి ఫస్ట్ టైం ప్రభాస్, ప్రశాంత్ నీల్ ల కలయికలో రానున్న ఈ సలార్ మూవీ ఎంత మేర విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: