సుహాసిని పుట్టిన రోజు వేడుకల్లో హల్చల్ చేసిన హీరోయిన్స్

Mamatha Reddy
90వ దశకంలో దక్షిణాదిని ఒక ఊపేసిన హీరోయిన్ లు అందరూ ఇప్పుడు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. లేటు వయసులో కూడా పార్టీలు పబ్బులు అంటూ ఒకప్పుడు వారు చేసిన ఎంజాయ్ మెంట్ ను ఇప్పుడు చేస్తున్నారు.అంతేకాదు అప్పుడప్పుడు వీరు ఒకే వేదికపై కలుసుకుని తమ జీవితాన్ని ఎంతగా ఎంజాయ్ చేస్తున్నామో చూడండి అంటూ చాటి చెబుతున్నారు. కొంతమంది హీరోయిన్లు దక్షిణాదిన పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు.

ఇంకా కొంతమంది హౌస్ వైఫ్ గా కొనసాగుతున్నారు. అయితే ఎవరు ఏ పని చేసినా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో పార్టీలలో కలిసి తమ పాత రోజులను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఆ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ విధంగా అలనాటి హీరోయిన్ లు అయినా రోజా మీనా రమ్యకృష్ణ సుహాసిని ఖుష్బు రాధిక వంటివారు ఇటీవల సుహాసిని బర్త్ డే వేడుకలకు హాజరయ్యారు. మణిరత్నం భార్య అయిన సుహాసిని బర్త్ డే వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. కమలహాసన్ ఫ్యామిలీ కూడా కదిలి వచ్చింది.

అంతేకాదు సీనియర్ హీరోయిన్లు కూడా చాలా మంది వచ్చారు. అందరూ కలిసి పార్టీలో ఎంజాయ్ చేశారు.  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఎంజాయ్మెంట్ వేరే రేంజ్ లో ఉందని చెప్పవచ్చు. ఈ వేడుకలలో అందరిలోకెల్లా సుహాసిని స్పెషల్ గా నిలిచింది. సుహాసిని ఇప్పుడు దక్షిణాదిన క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలతో ఫుల్ బిజీగా ఉంది. ఆమె భర్త మణిరత్నం కూడా వరుస భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తూ దర్శకుడిగా తన స్టామినాను నిరూపించుకుంటూ వస్తూనే ఉన్నాడు. ప్రేమ వివాహం చేసుకున్న వీరిద్దరూ తమ సంసార జీవితాన్ని ఎంతో అన్యోన్యంగా గడుపుతూ వస్తున్నారు. లీడర్ సినిమా తో సుహాసిని తెలుగునాట రీ ఎంట్రీ ఇవ్వగా ఇప్పుడు మంచి మంచి పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను ఎంతో అలరిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: