విజయశాంతికి విషెస్ తెలిపిన మహేష్..!

Suma Kallamadi
తెలుగు పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్న విజయశాంతి ఈ రోజు అనగా జూన్ 24వ తేదీన తన 55వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆమెకు భారత దేశ వ్యాప్తంగా చాలామంది బర్త్ డే శుభాకాంక్షలు చెబుతున్నారు. అభిమానులు, తోటి నటీనటులు, తదితర సెలబ్రిటీలు ఆమెకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రిన్స్ మహేష్ బాబు విజయశాంతి కి ప్రత్యేక విషెస్ తెలిపారు.
"పుట్టినరోజు శుభాకాంక్షలు విజయశాంతి గారు! మీకు ఎల్లప్పుడూ ఆనందం, శాంతి, గొప్ప ఆరోగ్యం ఉండాలని కోరుకుంటున్నాను!," అని లేడీ అమితాబ్ బచ్చన్ విజయశాంతికి మహేష్ బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.


మహేష్ బాబు, విజయశాంతి కలిసి కొడుకు దిద్దిన కాపురం, సరిలేరు నీకెవ్వరు చిత్రాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. 2006లో వచ్చిన నాయుడమ్మ సినిమాలో ఆమె నటించారు. మళ్ళీ ఆమె 14 సంవత్సరాల తర్వాత సరిలేరు నీకెవ్వరు చిత్రంతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ఆమె మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ పాత్రలో నటించారు. ఆమె కొడుకు దిద్దిన కాపురం సినిమా లో సూపర్ స్టార్ కృష్ణ కి జంటగా నటించారు. విజయశాంతి తన నలభై ఏళ్ల కెరీర్ లో 187 చిత్రాల్లో నటించి మెప్పించారు. కర్తవ్యం సినిమాలోని పవర్ ఫుల్ పోలీస్ అధికారిణి పాత్రలో ఆమె అద్భుతమైన నటనా ప్రదర్శన కనబరిచి నేషనల్ అవార్డు కైవసం చేసుకున్నారు. ప్రతిఘటన సినిమాలో కూడా అద్భుతమైన నటన చాతుర్యాన్ని ప్రదర్శించి నంది అవార్డుతో పాటు ఫిలింఫేర్ అవార్డు కూడా దక్కించుకున్నారు.
ఆమె యాక్షన్ సినిమాల్లో మగరాయుడిగా నటించి "ది యాక్షన్ క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమా" బిరుదు పొందారు. విజయశాంతి 1988లో ఎం.వి శ్రీనివాస్ ప్రసాద్‌ ను పెళ్లి చేసుకున్నారు. ఆయన చెన్నై, హైదరాబాద్ సిటీలలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: