ఓటీటీలో సత్తా చాటిన హీరోయిన్స్ వీళ్ళే..!
భరత్ అనే నేను సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది కియారా అద్వానీ. ఆమె ప్రస్తుతం బాలీవూడ్ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఇక నెట్ ఫ్లిక్స్ రూపొందించిన లస్ట్ స్టోరీస్ సిరీస్ లో ఆమె నటించారు. ఈ సిరీస్ లో కియారా ఓ టీచర్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. ఇక ఇప్పటికే తమన్నా హాట్ స్టార్, ఆహాలో వెబ్ స్టోరీస్ ద్వారా తన సత్తా చాటుతూ ప్రేక్షకుల నుండి ఆదరణ పొందుతుంది.
టాలీవూడ్ చందమామ కాజల్ అగర్వాల్ తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆచార్య, భారతీయుడు 2 సినిమాలో నటిస్తుంది. అంతేకాక హాట్ స్టార్ లో లైవ్ టెలికాస్ట్ పేరిట ఓ ఘోస్ట్ ఫ్యాంటసీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో నటించి తన సత్తా చాటుకుంది. ఇక లోకనాయకుడి కుతురు, టాలీవూడ్ హీరోయిన్ శృతి ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ లోని పావైకథైగల్ సిరీస్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇక ఒకప్పటి స్టార్ హీరోయిన్ ప్రియమణి. ఆమె ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో సుచిత్ర పాత్రలో ఓ వర్కింగ్ ఉమెన్ మోడ్రన్ వైఫ్ గా మనోజ్ బాజ్ పాయ్ సరసన నటించి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక తెలుగమ్మాయి ఈశా రెబ్బ నెట్ ఫ్లిక్స్ నిర్మించిన లస్ట్ స్టోరీస్ తెలుగు వెబ్ సిరీస్ లో నటించారు. అలాగే సాయి పల్లవి పావ కథైగల్ సిరీస్ లో నటించింది.