డార్లింగ్ ఇప్పటికైనా ఆ ఇద్దరిలో ఎవరో సీక్రెట్ రివీల్ చేయవా ..?

Kunchala Govind
రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'రాధే శ్యామ్' చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాని గోపీకృష్ణ మూవీస్, యూవి క్రియోషన్స్ కలిసి నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. కాగా 'రాధే శ్యామ్' తర్వాత 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నాడు. ప్రభాస్ కెరీర్లో 21వ సినిమా తెరకెక్కబోతున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ సమర్పణలో ప్రియాంక దత్, స్వప్న దత్ దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ నిర్మిస్తున్నారు.
సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమాని హాలీవుడ్ టెక్నికల్ టీం తో రూపొందించనున్నట్టు ఇప్పటికే మేకర్స్ వెల్లడించారురు. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా రూపొందనున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకుణే నటించనుంది. దీపిక కి భాజీరావ్ మస్తానీ, పద్మావత్ సినిమాలతో నేషనల్ వైడ్ గా విపరీతమైన పాపులారిటీ, క్రేజ్ ఉండటంతో ఈ సినిమా మీద ఊహకందని రేంజ్ లో అంచనాలున్నాయి. వాటిని ఇప్పుడు ప్రముఖ సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాస్ రావు గారు వచ్చి ఈ ప్రాజెక్ట్ క్రియోటివ్ హెడ్ గా చేరి ఇంకా పెంచేశారు.
అయితే ఇప్పుడు ఫైనల్ కావాల్సింది ఈ సినిమాకి మ్యూజిక్ అందించే గ్రేట్ టెక్నీషియన్ ఎవరు అని. గత కొన్ని రోజులుగా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే.  దర్శకుడు నాగ్ అశ్విన్, ప్రభాస్ పెద్ద కన్‌ఫ్యూజన్ లో ఉన్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ని తీసుకునే ఆలోచనలో నాగ్ అశ్విన్ ఉన్నాడట.
రెహమాన్ ఇండియాలోనే టాప్ మ్యూజిక్ కంపోజర్ గా క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. అలాగే 'బాహుబలి' సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఎమ్.ఎమ్. కీరవాణి అయినా తమ సినిమా రేంజ్ కి బాగా కలిసొస్తుందని భావిస్తున్నారట. ముఖ్యంగా ప్రభాస్ ఒక మాట చెప్పి ఒకరిని ఫైనల్ చేస్తే బావుంటుందన్న ఆప్షన్ డార్లింగ్ చేతిలో పెట్టినట్టు సమాచారం. అందుకే ప్రభాస్ ఎవరిని ఫైనల్ చేస్తాడో తెలియక ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: