తెలుగు సినిమాకు హీరోయిన్ల గ్లామరే పెద్ద పెట్టుబడి. ప్రతీ ఏటా ఎందరో అందాల భామలు టాలీవుడ్ కి రావడం తమ లక్కుని టెస్ట్ చేసుకోవడం జరుగుతోంది. అయితే కొందరే క్లిక్ అవుతున్నారు. అతి కొద్ది మందే స్టార్ స్టాటస్ సొంతం చేసుకుంటున్నారు. ఆ విధంగా చూసినపుడు 2018లో లక్కీయెస్ట్ ఎవరన్నది చూసుకుంటే ఆ ఇద్దరు భామలే కళ్ళ ముందు కనిపిస్తారు. తమ అందం, అభినయంతో అశేష ప్రేక్షకులను ఆకట్టుకుని కనికట్టు చేశారు.
మహానటితో కీర్తి సురేష్ కీర్తి అమాంతం పెరిగిపోయింది. ఆమెకు ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ ఇమేజ్ వచ్చేసింది. మరో సావిత్రిగా తెలుగు జనం చేత విశేష ప్రశంసలు అందుకుంది. సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన ‘మహానటి’తో కీర్తి కీర్తిమారిపోయింది. ఈ బయోపిక్తో కీర్తి సురేష్ నటనకు టాలీవుడ్డే కాదు, జాతీయ సినిమా అభిమానులూ ఫిదా అయ్యారు. ఒక్క సినిమాతో తిరుగులేని ఇమేజ్ సాధించి స్టార్డమ్ కైవసం చేసుకుంది కీర్తి. ఈ ఏడాది కీర్తి కిరీటంలో మహానటి కలికితురాయిని నిలిచి ఆమెకు బలమైన పునాదిని వేసేసింది.
ఇక ఆమె తరువాత చెప్పుకోవాల్సింది రష్మి మండన. ఈ ముద్దు గుమ్మ చలో అంటూ టాలీవుడ్ కి వచ్చిన గీతా గోవిందం తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసి ఓవర్ నైట్ స్టార్ డం సంపాదించుకుని. వంద కోట్ల సినిమా కధానాయికగా గుర్పింపు తెచ్చుకుంది. ఇపుడు టాలీ వుడ్ అంతా రష్మిక అని కలవరిస్తోందంటే ఆమెకు 2018 చేసిన మేలు అంతా ఇంతా కాదు. చాల తక్కువ టైంలో ఆమె స్టార్ హీరోల సరసన మెరిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక సీనియర్లలో సమంత తప్ప అంతా 2018లో బొల్తా పడ్డారు. పల్లెటూరి అమ్మాయిగా సమంత రంగస్థలం మూవీలో చేసిన నటన ఆమెకు 2019 తీపి గురుతుగా ఉంటుందని చెప్పకతప్పదు. ఆ తరువాత యూ టర్న్ అంటూ సమంత చేసిన మరో విభిన్నమైన చిత్రం కూడా అమెకు మంచి పేరు తెచ్చింది. ఇక మిగిలిన వారంతా 2018లో ఫిట్ అయిపొయారనే చెప్పాలి.
కాజల్, రాశీఖన్నా, తమన్నా, అనుపమ పరమేశ్వరన్, ప్రజ్ఞా జైస్వాల్, మెహ్రీన్ కౌర్, లావణ్య త్రిపాఠి, శ్రీయలాంటి ముద్దుగుమ్మలూ ఈ ఏడాది ఆడియన్స్ని మురిపించలేకపోయారు . చాలా గ్యాప్ తరువాత రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీతో రీ ఎంట్రీ ప్రయత్నం చేసిన ఇలియానాకు కూడా 2018 కలసిరాలేదనే చెప్పాలి. మరో గ్లామర్భామ అను ఇమ్మాన్యుయేల్ పరిస్థితీ ఇందుకు భిన్నంకాదు. మొత్తానికి కీర్తి, రష్మిక ఈ ఇద్దరే 2018కి నచ్చిందనుకోవాలి.