స్నానం చేసిన తర్వాత అసలు ఇలాంటి తప్పులు చేయకండి..!!

Divya
ఇటీవల కాలంలో చాలామంది డబ్బు సంపాదనలో పడి, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడమే మర్చిపోయారు. ఇంట్లో ఎప్పుడు చికాకులు,మనశ్శాంతి లేకపోవడం, గొడవలు వంటి నెగటివ్ ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి.దీనంతటికీ కారణం మన ఇంట్లో ప్రవేశించిన నెగటివ్ ఎనర్జీ అని చెబుతున్నారు వేదపండితులు. కొంతమంది ఇళ్లల్లో ఎంత డబ్బు ఉన్నా సరే,ఎప్పుడు ఏదో ఒకటి గొడవ జరుగుతూనే ఉంటుంది.అలా కాకుండా ఇంట్లో ఎప్పుడూ పాజిటివ్గా ఉండి,మనశ్శాంతి కలగడానికి స్నానం చేసిన తర్వాత కొన్ని పనులు చాలా బాగా ఉపయోగపడతాయట.మీ ఇంట్లో కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారా...మరి ఇంకెందుకు ఆలస్యం ఆ పనులు ఏంటో మనము తెలుసుకుందాం పదండి..
ప్రతి ఒక్కరు స్నానం ఆచరించడం..
ఇంట్లో పాజిటివ్ శక్తి నింపడానికి ప్రతి ఒక్కరు శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం.ఎందుకంటే ప్రతిరోజు స్నానం చేయడం వల్ల శరీరంలో ఉన్న బ్యాక్టీరియా వెళ్లిపోవడమే కాక,పరిసరాలు కూడా పరిశుభ్రంగా కనిపిస్తాయి.దీనితో మెదడులో పాజిటివ్ ఎనర్జీ మొదలై,ఆ రోజంతా పాజిటివ్ గానే జరుగుతుంది.
మరియు ఇంటిని శుభ్రం చేసే నీటిలో పసుపు కానీ, ఉప్పును కానీ,కర్పూరం కానీ వేసి శుభ్రం చేయాలి.ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పోగొట్టే గుణం ఆ పదార్థాలలో ఉంటుంది.మరి ముఖ్యంగా ఉప్పును వేసి,ఇళ్లంతా శుభ్రం చేయడం వల్ల,ఉప్పుకు ప్రతికూల శక్తుల్ని తరిమేడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
ప్రతిరోజు స్నానమాచనించిన తర్వాత కచ్చితంగా ఉతికిన బట్టలనే వేసుకోవాలి.కానీ కొంతమంది ఒకరోజు వేసుకున్న దుస్తులను రెండు మూడు రోజులు వేసుకోవడం అలవాటు ఉంటుంది.అలా వేసుకోవడం వల్ల,వాళ్ళింట్లో నెగటివ్ ఎనర్జీ పెరగడమే తప్పా లాభాలు ఏమీ కలగవు.
ప్రతిరోజు స్నానమాచరించి పూజగదిని శుభ్రం చేసుకుని, దీపారాధన చేయడం వల్ల కూడా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ మొదలవుతుంది.మరియు గంగాజలం ప్రకృతి నుండి లభించింది.కనుక వీటిలో ఆయుర్వేద గుణాలు ఉంటాయి.కాబట్టి వీటిని ఇంట్లో చల్లుకోవడం వలన అంతా మంచి జరుగుతుంది.మరీ ముఖ్యంగా ఇంటి ముఖ ద్వారం దగ్గర చల్లడంతో ఎలాంటి ప్రతికూల ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది.కాబట్టి స్నానం చేసిన తర్వాత ఈ నియమాలన్నీ ఆచరించడం అసలు మర్చిపోకండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: