ఈ టిప్ పాటిస్తే కంటి సమస్య పరార్?

Purushottham Vinay
ఇక ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది కూడా కంటి సమస్యలతో ఎంతగానో బాధపడుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ కూడా ఎక్కువగా ఈ సమస్యల బారిన పడుతున్నారు. కంటి చూపు మందగించడం, కళ్ల నుండి నీరు కారడం, కళ్లు ఎర్రబడడం, కళ్లు మసకగా కనబడడం, కళ్లు పొడి బారడం ఇంకా అలాగే కంటిలో దురదలు ఇలా కంటి సమస్యలతో బాధపడే వారు మనలో చాలా మంది ఉంటారు.స్మార్ట్ ఫోన్ లను, ల్యాప్ టాప్ లను ఎక్కువగా వాడడం, పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడం వంటి వివిధ కారణాల వలన కళ్ళ సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అలాంటి వారు ఈ పొడిని వాడడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలు పొందవచ్చు. ఈ పొడిని వాడడం వల్ల కళ్లద్దాలను కూడా ఉపయోగించాల్సిన పని ఉండదు. అలాగే ఈ పొడిని చిన్న పిల్లల నుండి పెద్ద వారి దాకా ఉపయోగించవచ్చు.


ఈ పొడిని తయారు చేసుకోవడానికి  మనం 10 గ్రాముల తెల్ల మిరియాలను, 50 గ్రాముల సోంపు గింజలను, 50 గ్రాముల బాదం పప్పును, 100 గ్రాముల పటిక బెల్లాన్ని ఇంకా 10 గ్రాముల యాలకులను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా మీరు పటిక బెల్లాన్ని పొడిగా చేసి జార్ లోకి తీసుకోవాలి. ఆ తరువాత మిగిలిన పదార్థాలన్నీ వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి.ఇంకా ఈ పొడిని గాజు సీసాలో వేసి స్టోర్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని ప్రతి రోజూ రాత్రి పడుకోవడానికి అరగంట ముందు ఒక గ్లాస్ పాలల్లో ఒక టీ స్పూన్ మోతాదులో వేసి కలిపి పాలను రోజు తాగాలి. ఇలా తాగడం ఇష్టంలేని వారు పొడిని తిని పాలను తాగండి.ఇంకా అలాగే పిల్లలకు ఉదయం పూట అల్పాహారం తిన్న తరువాత పాలల్లో కలిపి తాగించాలి.ఇలా ఈ పొడిని నెల రోజుల పాటు తీసుకోవడం వల్ల కంటి సమస్యలన్నీ చాలా ఈజీగా దూరమవుతాయి.అలాగే కంటి ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి.కంటి చూపుని బాగా మెరుగుపర్చుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: