లైఫ్ స్టైల్: వంటింట్లో దొరికే ఈ వస్తువుతో నొప్పులన్నీ పరార్..!
గొంతు నొప్పిగా ఉన్నా.. లేదా గొంతు గరగర అనిపించినా.. ఈ నెయ్యి ని తినడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది. దగ్గు ఉన్నప్పుడు నెయ్యి తింటే దగ్గు ఇంకా ఎక్కువ అవుతుందని అంటారు కానీ గోరువెచ్చగా తినడం వల్ల గొంతు నొప్పితో పాటు దగ్గు కూడా మాయమవుతుంది.
ఎవరైనా కాన్స్టిపేషన్ సమస్యతో బాధపడుతున్నట్లయితే అలాంటి వాళ్లు ప్రతిరోజు రాత్రి సమయంలో నెయ్యిని తినడం వలన త్వరగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
కంటి ఆరోగ్యానికి కూడా నెయ్యి ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ నెయ్యిని తినడం వల్ల కంటి చూపు మెరుగుపడటంతో పాటు ఎలాంటి కంటి సమస్యలు అయినా సరే దూరం అవుతాయి. ముఖ్యంగా నెయ్యిలో ఔషధగుణాలు పుష్కలంగా లభిస్తాయి కాబట్టి.. ప్రతి ఒక్కరూ వీలైనంతవరకు దేశీయ ఆవు నెయ్యిని ఆహారంలో చేర్చుకోవడం ప్రయత్నం చేయాలి.
అంతే కాదు మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ నెయ్యిని ప్రతి రోజు తినడం వల్ల శరీరంలో ఉండే చెడు బ్యాక్టీరియా బయటకు వెళ్ళిపోయి, సరి కొత్తగా మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది. శరీరంలో వచ్చే వివిధ రకాల నొప్పులు కూడా ఈ నెయ్యి తినడం వల్ల మాయం అవుతాయి. కాబట్టి ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసే దేశి ఆవు నెయ్యిని ఆహారంలో చేర్చుకుంటే సత్ఫలితాలు కలుగుతాయి.