13కోట్ల `టూనా` చేప గురించి తెలుసుకోండి...?
జపాన్ లోని సుషీ చెయిన్ రెస్టారెంట్ల ఓనర్ కియోషి కిమురా ఈ 267 కిలోల భారీ చేపను వేలంలో దక్కించుకున్నాడు. గతేడాది ఇంతకంటే బరువైన చేపను కూడా కిమురానే కొనేశాడు. అప్పుడు దాని ధర రికార్డు స్థాయిలో రూ.22 కోట్లు పలికింది. కిమురాకు జపాన్ వ్యాప్తంగా చెయిన్ రెస్టారెంట్లు ఉన్నాయి. తన రెస్టారెంట్లలో టూనా చేపల వంటకాలకు మాంచి డిమాండ్ ఉందని, కస్టమర్ల తృప్తే తమ ధ్యేయమని కిమురా తెలిపారు.
ఒక్కొక్కసారి అండమాన్, కేరళ, తమిళనాడులోని కొన్నిచోట్ల మత్స్యకారుల వలలకు చిక్కుతుంది. ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే అంటే- నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఇది సముద్రంలో స్వేచ్ఛగా విహరిస్తుంది. ఆ సమయంలోనే జాలర్లు వాటిని వేటాడి పట్టుకుని సొమ్ము చేసుకుంటారు. టూనా నీటిలో ఈదే తీరు, వాటి సంచారం, వేటాడే పద్ధతి, మార్కెట్కు చేరవేసే ప్రక్రియ, విక్రయించే పద్ధతి అన్నీ ఆసక్తి కలిగిస్తాయి. ఇది కొత్త జీవరాశి ఏమీ కాదు. ఎప్పటి నుంచో ఉన్నదే. కాకపోతే ఇదివరకు ఈ చేపను ప్రత్యేకంగా ఎవరూ వేటాడలేదు. అందుకే వెలుగులోకి రాలేదు.