స్టోరీ టైం : తోడేలు, ఏడు మేకల కథ

Vimalatha
ఈరోజు మనం తోడేలు, ఏడు మేక పిల్లల కథ గురించి తెలుసుకుందాం.
ఒక మేక తన ఏడుగురు పిల్లలతో అడవిలో ఉన్న గడ్డి మైదానంలో నివసించేది. ఒక రోజు మేక అడవి నుండి ప్రమాదకరమైన నల్ల తోడేలు వచ్చి తన పిల్లలను తినడానికి ప్రయత్నించడం గమనించింది. అప్పటి నుంచి తన పిల్లలను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఆపేసింది. ఒక రోజు మేక ఆహారం కోసం ఏర్పాట్లు చేయడానికి బయటకు వెళ్ళవలసి వచ్చింది. బయలుదేరే ముందు పిల్లలకు తల్లి “నా ప్రియమైన పిల్లలారా! ఇల్లు వదిలి బయటకు రావద్దు. ప్రమాదకరమైన తోడేలు తిరుగుతోంది. ఎవరైనా తలుపు తడితే,అడగకుండా తలుపు తెరవకండి. ఇది నల్ల తోడేలు. దీనికి నల్లటి కాళ్లు ఉన్నాయి. దాని గొంతు బొంగురుగా ఉంటుంది. ఇది దాని గుర్తింపు" అంటూ జాగ్రత్త చెప్పి వెళ్తుంది. తోడేలు తల్లి మేక ఇంటి నుంచి వెళ్లిపోవడం చూసి పిల్లలను తినడానికి దాని ఇంటికి వెళ్ళింది. తోడేలు తలుపు తట్టి "నేను మీ అమ్మను" అని చెప్పింది.
మేక పిల్లలు దాని స్వరాన్ని గుర్తించడంతో తోడేలు అక్కడి నుంచి వెళ్లిపోయింది. తన గొంతు తేనె తిన్న తర్వాత మేక గొంతులా మధురంగా మారింది. మళ్ళీ మేకల దగ్గరకు తోడేలు వెళ్లగా, నీ కాళ్ళు నల్లగా ఉన్నాయి అంటాయి అవి. ఈసారి తోడేలు తనపైన పిండి పోసుకుని వచ్చింది. మళ్ళీ తలుపు కొడుతుంది అమ్మను అంటూ. దీంతో మేకలు అది నమ్మేసి తలుపు తీస్తాయి. ఎడిఎంతో తోడేలు వాటిని మింగేస్తుంది. తిరిగి వచ్చిన మేక తన పిల్లలు కన్పించక పోవడంతో నేరుగా పడుకున్న నక్క దగ్గరకు వెళ్ళి, దాని పొట్టను చీల్చేసి తన పిల్లలను బయటకు తెచ్చుకుంటుంది. తోడేలు కడుపులో ఒక రాయిని వేసి కుడుతుంది.  
తోడేలు మేల్కొన్నప్పుడు దాహం వేసింది. బరువుగా ఉన్న పొట్టతో ఎలాగోలా సరస్సును చేరుకున్న నక్క నీళ్లు తాగడానికి వంగుతుంది. అంతే రాళ్ల బరువు కారణంగా నీటిలో మునిగి చనిపోతుంది.
 
మోరల్ : చేదు ఆలోచనల ఫలితం చెడుగానే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: