హైదరాబాద్ లో నిపా వైరస్-ఆందోళనలో వైద్యులు
ఇద్దరు యువకులకు నిపా
ఇదిలావుండగా మరో యువకుడు కూడా ఇదే విధంగా నిమ్స్ ఆసుపత్రికి వెళ్ళాడు. పరీక్షించిన వైద్యులు వెంటనే లక్షణాలు గుర్తించి ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స మొదలుపెట్టారు. ఇతర రక్త నమూనాలు కూడా సేకరించారు. కేరళలో ఇదే వైరస్ తో ఇప్పటికి సుమారు 12 మంది మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. నివారణ లేని నిపా వైరస్ కు ముందుజాగ్రత్త పడటమే మార్గం. పండ్లను కొరికిన గబ్బిలాల వల్ల, గుడ్ల గూబలు, పందుల వల్లే నిపా వైరస్ సోకుతున్నట్లు డాక్టర్లు గుర్తించారు. కేరళను వణికిస్తున్న నిపా వైరస్ తెలుగు రాష్ట్రాలకు ఎక్కడ సోకుతుందో అన్న ఆందోళన పడుతుండగానే హైదరాబాద్ లోని ఇద్దరు యువకులకు వైరస్ సోకిందని వైద్యులు అనుమానిస్తుండటంతో ప్రభుత్వాధికారుల్లో ఆందోళన ఎక్కువైపోయింది.