అరటి పండ్లను తినడం వల్ల మనకు ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అరటి పండ్లు మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలో కూడా లభిస్తాయి.అందుకే అరటి పండ్లను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఇవి చాలా చవకగా కూడా లభిస్తాయి.కాబట్టి పేద, మధ్య తరగతి వారు కూడా అరటి పండ్లను ఎక్కువగా కొనుగోలు చేసి తింటుంటారు.అయితే షుగర్ ఉన్నవారు ఈ పండ్లను తినవచ్చా? ఒకవేళ తిన్నా షుగర్ పెరగకుండా ఈ పండ్లను ఎలా తినాలి? వంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.అయితే అరటి పండ్లను బాగా పండినవి కాకుండా కాస్త దోరగా ఉన్నవి మాత్రమే తినాలి.ఎందుకంటే బాగా పండినవి అయితే తియ్యదనం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆ పండ్లను తింటే తేలిగ్గా జీర్ణమై త్వరగా చక్కెర రక్తంలో కలుస్తుంది. దీంతో షుగర్ లెవల్స్ అనేవి పెరుగుతాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు బాగా పండిన అరటి పండ్లను కాకుండా కాస్త దోరగా ఉన్న అరటి పండ్లను తింటే వారి ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిల్లో ఒక మీడియం సైజ్ అరటి పండులో అయితే సుమారుగా 14 గ్రాముల కార్బొహైడ్రేట్లు ఉంటాయి. కాబట్టి ఒక పండును తిన్నా ఏమీ కాదు.
పెద్దగా షుగర్ లెవల్స్ కూడా పెరగవు.అయితే అరటి పండ్లను షుగర్ ఉన్నవారు ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా తినరాదు. వీటిని బ్రేక్ ఫాస్ట్ లేదా లంచ్, లంచ్ లేదా డిన్నర్ మధ్యలో మాత్రమే తినాలి. ఇంకా వీటితోపాటు ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారాలను కలిపి తినాలి. అందువల్ల అరటి పండ్లలో ఉండే చక్కెరలను శరీరం నెమ్మదిగా శోషించుకుంటుంది. అందు వల్ల షుగర్ లెవల్స్ ఒకేసారి పెరగవు. నెమ్మదిగా పెరుగుతాయి. కాబట్టి ఇలా అరటి పండ్లను షుగర్ ఉన్నవారు తింటే ఏమీ కాదు.అరటి పండ్లను తింటే కొంతమందిలో షుగర్ లెవల్స్ త్వరగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అరటి పండ్లను తిన్న అనంతరం గంటన్నర పాటు ఆగి షుగర్ చెక్ చేయాలి.ఎక్కువగా ఉంటే అలాంటి వారు ఈ పండ్లను అస్సలు తినరాదు.మీకు షుగర్ లెవల్స్ తక్కువగా ఉంటే ఈ పండ్లను తినవచ్చు. ఈ విధంగా షుగర్ ఉన్నవారు ఎలాంటి భయం లేకుండా అరటి పండ్లను తీసుకోవచ్చు. దీని వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి.