ఈ డ్రింక్ తాగితే కంటి చూపు, కడుపు సమస్యలు రానేరావు!

Purushottham Vinay
ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతున్నారు. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవటానికి ఆసక్తి చూపుతూ దానికి అనుగుణంగా వారు అడుగులు వేస్తున్నారు.ఇక ఈ రోజు యాపిల్, బీట్ రూట్ ఇంకా అలాగే క్యారెట్ ఈ మూడింటినీ కలిపి తయారుచేసినా డ్రింక్ తీసుకుంటే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఈ డ్రింక్ ని ఉదయం పూట పరగడుపున తీసుకుంటే ప్రేగులు, కాలేయం ఇంకా అలాగే రక్తనాళాలు శుభ్రం అవుతాయి. రెండు క్యారెట్ లను తీసుకొని వాటి తొక్క తీసి ముక్కలుగా కట్ చేయాలి. క్యారెట్ కాలేయ పనితీరును బాగా ప్రేరేపిస్తుంది. ఇక కాలేయంలో టాక్సిన్స్ పేరుకుపోకుండా కూడా నిరోధించి మెరుగైన కాలేయ పనితీరును ప్రోత్సహిస్తుంది.అలాగే ఒక ఆపిల్ కూడా తీసుకొని దాని తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఆపిల్ లో పెక్టిన్ అనేది ఉండుట వలన జీర్ణవ్యవస్థ నుండి విషాన్ని తొలగిస్తుంది. అలాగే రక్తంలో కొలెస్ట్రాల్ ని కూడా ఈజీగా నియంత్రిస్తుంది.


ఇంకా హానికరమైన పదార్ధాల మొత్తాన్ని తగ్గించటం వలన కాలేయంపై కూడా బారం తగ్గుతుంది. ఇక దాంతో కాలేయం పనితీరు బాగుంటుంది.అలాగే బీట్ రూట్ లో సగాన్ని తీసుకొని తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. బీట్ రూట్ రక్త ప్రసరణను బాగా మెరుగుపరుస్తుంది. అలాగే శరీరానికి తగినంత శక్తిని అందిస్తుంది.ఇంకా రోజంతా హుషారుగా ఉండేలా చేస్తుంది. ఒక మిక్సీ జార్ లో క్యారెట్ ముక్కలు ఇంకా ఆపిల్ ముక్కలు,బీట్ రూట్ ముక్కలు ఇంకా ఒక గ్లాస్ నీటిని వేసి మిక్సీ చేయాలి.ఇక మిక్సీ చేసిన ఈ మిశ్రమాన్ని గ్లాసులోకి వడకట్టి అరచెక్క నిమ్మరసం కలిపి ఉదయం పూట పరగడుపున లేదా బ్రేక్ ఫాస్ట్ చేయటానికి ఒక అరగంట ముందు తాగాలి. ఈ విధంగా పది రోజుల పాటు తాగితే ప్రేగులు ఇంకా కాలేయం అలాగే రక్త నాళాలు శుభ్రం అవుతాయి. అలాగే కంటి చూపు కూడా మెరుగు పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: