పడిపోయిన పుత్తడి.. పరుగులు పెడుతున్న వెండి..

Satvika
మహిళలకు గుడ్ న్యూస్.. పసిడి ధరలకు బ్రేకులు పడ్డాయి.. నిన్న మార్కెట్ లో స్థిరంగా ఉన్న బంగారం ధరలు నేటి మార్కెట్ లో కిందకు దిగి వచ్చాయి. బంగారం కొనే వారికి ఇది గుడ్ న్యూ్స్ అని చెప్పొచ్చు. బంగారం ధర తగ్గితే.. వెండి రేటు మాత్రం వేరే దారిలో నడిచింది. పైపైకి కదిలింది.ఇది నిజంగా ఊరట కలిగించే విషయం అని చెప్పాలి.. పసిడి రేటు గురువారం కూడా అంతకుముందు రోజులా ఉండడం గమనార్హం. బంగారం ధర స్థిరంగా ఉండగా.. వెండి రేటు మాత్రం పైకి మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం, వెండి ధరలు పెరిగాయి.

ఇకపోతే హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 పడిపోయింది. దీంతో రేటు రూ.45,490కు తగ్గింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.300 తగ్గుదలతో రూ.41,700కు పడిపోయింది. అయితే, బంగారం ధర తగ్గితే.. వెండి ధరలు మాత్రం పరుగులు పెడుతున్నాయి. ఈరోజు ధరలు ఒకసారి చూస్తే.. వెండి ధర రూ.100 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.69,500కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడం కారణంగా నిపుణులు చెబుతున్నారు.

ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.36 శాతం పెరుగుదలతో 1731 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 0.25 శాతం పెరుగుదలతో 25.11 డాలర్లకు పెరిగింది. బంగారం ధరల పై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి.. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు మొదలగు అంశాలు ప్రభావాన్ని చూపిస్తున్నాయి.. ఉగాది కి ధరలు తగ్గుతాయని వార్తలు వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: