పసిడి ప్రియులకు శుభవార్త.. మళ్లీ పడిపోయిన ధరలు..!!

frame పసిడి ప్రియులకు శుభవార్త.. మళ్లీ పడిపోయిన ధరలు..!!

Satvika
పసిడి ధరకు బ్రేకులు పడ్డాయి..మొన్నటి వరకు పైకి కదిలిన ధరలు నేటి మార్కెట్ లో వెల వెల బోతున్నాయి..బంగారం ధరలు గత కొన్ని రోజుల నుంచి పెరుగుతూ,తగ్గుతున్నాయి. మూడు రోజుల నుంచి స్వల్పంగా కిందకు దిగి వస్తున్నాయి. విదేశీ మార్కెట్ లో కొనుగోళ్లు పెరగడంతో,ఇండియన్ మార్కెట్ లో బంగారం ధరలు భారీగా పడిపోయాయని నిపుణులు అంటున్నారు. అంతేకాదు మొన్నీమధ్య ప్రవేశ పెట్టిన బడ్జెట్ కూడా ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అయితే బంగారం ధరల రేట్ల పై వెండి రేట్లు కూడా ఆధారపడి పయనిస్తున్నాయి. దగ్గరలో నూతన సంవత్సరం వస్తున్న సందర్భంగా బంగారం కొనుగోళ్లు భారీగా పెరిగినట్లు తెలుస్తుంది.. 


హైదరాబాద్ మార్కెట్ లో శనివారం బంగారం ధరలను పరిశీలిస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.650 క్షీణించింది. దీంతో రేటు రూ.47,730కు దిగొచ్చింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.600 పడిపోయింది. దీంతో ధర రూ.43,750కు తగ్గింది.బంగారం ధర పడిపోతే.. వెండి రేటు కూడా పైకి కదిలింది. కేజీ వెండి ధర రూ.400 పెరిగింది. దీంతో రేటు రూ.72,600కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడం ప్రధాన కారణమని తెలుస్తోంది.


అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరిగినా కూడా దేశీ మార్కెట్‌లో పసిడి రేట్లు పడిపోవడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 1.33 శాతం పెరుగుదలతో 1815 డాలర్లకు ఎగసింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 2.98 శాతం పెరుగుదలతో 27.01 డాలర్లకు ఎగసింది.బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు , మార్కెట్ లో బంగారు ఆభరణాల డిమాండ్ తగ్గడం వంటి వాటి వల్ల రేట్లు పూర్తిగా కిందకు దిగి వస్తున్నాయి..ప్రస్తుత రేట్లు చూస్తే పసిడి ప్రియులకు ఉగాదికి శుభవార్త అందుతుందని స్పష్టమవుతుంది. మరి రేపు ధరలు ఎలా ఉంటాయో చూడాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: