ఇంజనీరింగ్ సెకండియర్లో ప్రవే శాల కోసం ఈ సెట్-2017 అడ్మిషన్నోటిఫికేషన్ను జారీ చేశారు. ఈ నెల 30 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ప్రొఫెసర్ టి. పాపిరెడ్డి తెలిపారు. ఈ నెల 30 నుంచి జూలై 3 వరకూ సర్టిఫికెట్ వెరిఫికేషన్, జూలై 1 నుంచి 4 వరకూ కాలేజీల ఎంపికకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు గడువు విధించారు. ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులు మార్చుకునేందుకు జూలై 5 వరకూ అవకాశం కల్పించారు. జూలై 7న సీట్లు కేటాయించనున్నారు.
ఎంసెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్కు నేడు చివరి అవకాశం: ఎంసెట్-2017 సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరు కావాలనుకునే విద్యార్థులకు గురువారం చివరి అవకాశం కల్పించినట్లు కౌన్సెలింగ్ క్యాంపు ఆఫీసర్ బి. శ్రీనివాస్ తెలిపారు.