జగన్: చంద్రబాబు ఎత్తులతో భయం మొదలైందా?
ఈ సమయంలో చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఇకమీదట కేంద్రం నుంచి సమయానికి నిధులు వస్తాయా రావా అనే భయం జగన్ లో ఉంది. ఈ నెల పింఛన్లు అయితే దాదాపు 80శాతం పూర్తి చేశారు. అంతా ప్రశాంతంగా సాగుతుంది. ఇక మిగతా పథకాల పరిస్థితి ఏంటి. కేంద్రం నుంచి విడుదలయ్యే నిధుల విషయంలో టీడీపీ అడుగడుగునా అడ్డు పడుతుంది. ఇళ్లకు సంబంధించిన బిల్లులు ఈ నెలలో పంపిణీ చేద్దామని వైసీపీ భావించింది. కానీ టీడీపీ అధినేత వీటికి అడ్డుపడకుంటా ఉంటారా అంటే ప్రశ్నార్థకమే.
ఒకవేళ చంద్రబాబు ఆపించారు అన్నా.. సీఎంగా ఉండి ఎందుకు చేయించలేకపోయారు. అంటే టీడీపీ కూటమికే లాభం చేకూరుతుంది. మరోవైపు ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న చంద్రబాబు కేంద్రం అండతో వైసీపీ అనుకూల అధికారులను విధుల నుంచి పక్కకి తప్పించి తన అనునూయులను పెట్టించుకుంటున్నారు. ఇది జగన్ కు మింగుడు పడని విషయం. అధికారుల బదిలీ జరిగిన ప్రతిచోటా కూడా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మరి వీటిని జగన్ ఏ విధంగా అడ్డుకుంటారో చూడాలి.