టికెట్ల కేటాయింపులో బాబు ఫార్ములా ఇదే?
అయితే టీడీపీ అభ్యర్థుల ఎంపికలో పార్టీ పట్ల విధేయత, నిరంతర ప్రజా సంబంధాలే గీటురాయిగా తీసుకున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడి ఇదే అంశాన్ని సీరియస్ గా తీసుకొని కసరత్తు చేసినట్లు కనిపిస్తోంది. అయితే చాలా చోట్ల ఇద్దరు పార్టీ విధేయులే అయినప్పుడు ఒక్కరి వైపు మొగ్గు చూపడం సాధారణంగా జరిగేదే. కొన్ని స్థానాలను మనం గమనించినట్లయితే …పులివెందులలో గత ఎన్నికల్లో జగన్ పై సతీశ్ రెడ్డి పోటీ చేశారు. తర్వాత ఆయన పార్టీకి రాజీనామా చేశారు.
తమ్మళ్లపల్లిలో మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ తో పాటు లక్ష్మీ దేవమ్మ కుమారుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి టికెట్ ఆశించగా చివరకు జయచంద్రారెడ్డిని బరిలో దింపారు. మైదుకూరు టికెట్ కోసం డీఎల్ రవీంద్రారెడ్డి ప్రయత్నించగా..పుట్టా సుధాకర్ యాదవ్ కి ప్రకటించారు. కల్యాణ దుర్గంలో 2019లో ఓడిపోయిన ఉమా మహేశ్వర నాయుడు, మాజీ ఎమ్మెల్యే వనం హనుమంతరాయ చౌదరి పోటీ పడగా విస్త్రృత పరిచాయలున్నా సురేందర్ ని పోటీలో నిలిపారు. కొన్ని చోట్ల విధేయతకే అకవాశం దక్కినా కొన్నిచోట్ల మొండి చేయే ఎదురైంది.