జైలుకు బాబు: ఎల్లో మీడియా హాహాకారాలు?

చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసిన తర్వాత ఇకపై ఏమి జరుగుతుందో  అన్న విషయం ఏపీలో బాగా చర్చకు వచ్చింది. రాబోయే రోజుల్లో రాజకీయ చదరంగంలో కదిలే ఆట ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. సరిగ్గా ఎలక్షన్స్ దగ్గర పడుతున్న ఈ సమయంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వడం కూడా ఇప్పుడు చర్చకు తావిస్తుంది. ఇప్పుడు ఏమి జరగబోతుంది చంద్రబాబు నాయుడు విషయంలో అని దానిపై రెండు రకాల వాదనలు తెరపైకి వస్తున్నాయి.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన ప్రకారం ఫైనాన్షియల్ క్రైమ్స్ విషయంలో అన్ని కోర్టులతో పాటు సుప్రీంకోర్టు కూడా సీరియస్ గానే ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడుని రిమాండ్ కి పంపించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.‌ 400 పేజీల డాక్యుమెంట్ లో సిమెన్స్ కు సంబంధించిన విషయం మాత్రమే కాకుండా మాజీ చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీల సంతకాలు కూడా ఉన్నాయి. ఇలా పక్కా సాక్ష్యాలతో పాటు ఈడి కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టే ఆయనను రిమాండ్ కు పంపించారు.

మరో పక్కన తెలుగు దేశం పార్టీ లేదా, తెలుగు దేశం అనుకూలూరు ఏమనుకున్నారంటే.. చంద్రబాబు నాయుడు అరెస్టు చేయడం వల్ల ఉపయోగం ఏమీ లేదని కోర్టు భావిస్తుందని వాళ్ళు భావించారు. ఈ కేసులో చంద్రబాబుకు సంబంధించిన పాత్ర ప్రత్యేకంగా ఎస్టాబ్లిష్ అవ్వలేదు మిగిలిన వాళ్ళ లెక్క ఎలా ఉన్నా సరే అని వాళ్ళు వాదించారు. క్రింద అధికారులకు సంబంధించి రెండు సంతకాలు కనిపిస్తున్న కూడా  చంద్రబాబు మాత్రం సంతకాలు పెట్టలేదు కదా అని వాళ్ళు భావించారు.

చంద్రబాబు మౌఖికంగా మాత్రమే ఆదేశాలు ఇచ్చారని తెలుస్తుంది కాబట్టి ఆయనకు బెయిల్ ఇస్తారని వాళ్లు భావించారు. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే వైసిపి తప్ప తెలుగుదేశం పార్టీ, జనసేన, కమ్యూనిస్టు పార్టీ ఇలా అందరూ కూడా బాబుకు  బెయిల్ వస్తుందని భావించారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా చంద్రబాబుకు రిమాండ్ విధించడంతో ఎల్లో మీడియాలో హాహాకారాలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: