నిజం: చైనా ప్రపంచ లీడర్గా ఎదుగుతోందా?
జపాన్ లోని సుంకోసి దీవులు తమవని చెబుతారు. ఆస్ట్రేలియాలో ని సముద్ర జలాల్లో తమదేనని ప్రకటిస్తాడు. రష్యా లో ఉన్న భూభాగం, ఇండియాలోని గాల్వాన్ లోయ, టిబెట్ లోని భూభాగం అన్ని చైనావేనని దుందుడుకు చర్యలకు ఉపక్రమిస్తున్నాడు. వీటిన్నింటి చోట్ల విద్వేషాలు పెంచుతున్న జిన్ పింగ్ ప్రపంచ శాంతి కోసం పోరాడతానని ప్రకటిస్తున్నాడు.
అమెరికా సుదీర్ఘ కాలం పాటు ముస్లిం దేశాల్లో విద్వేషాలతో తన ఆయుధ వ్యాపారాన్ని కొనసాగించుకుంటోంది. ఇలాంటి సమయంలో చైనా అధ్యక్షుడు సౌదీ అరేబియా, ఇరాన్ లతో శాంతి చర్చలు జరిపించి షియా, సున్నీలను కలిపేశారు. సిరియా, లెబనాన్ లతో శాంతి చర్చలు జరిపారు. సిరియాతో గల్ప్ దేశాలకు ఉన్న గొడవలు జరగకుండా శాంతి చర్చలు జరిపి వారిని కలిపారు. ఇలాంటి సమయంలో మరో పెద్ద సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తోంది.
ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య ఎన్నో ఏళ్లుగా సరిహద్దుల్లో గొడవలు జరుగుతున్నాయి. పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ చైనాలో పర్యటిస్తున్నారు. తద్వారా ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య శాంతి నెలకొల్పాలని చైనా అధ్యక్షుడు భావిస్తున్నాడు. శాంతిని నెలకొల్పడం ద్వారా ప్రపంచ శాంతి దూతగా చైనా నిలవాలని ప్రయత్నిస్తోంది. రష్యా, ఉక్రెయిన్ మధ్య కూడా శాంతి కుదుర్చాలని ప్రయత్నం చేసినా అది కుదరలేదు. అయితే ఇజ్రాయిల్ అమెరికాతో స్నేహబంధం ఉంది. కాబట్టి చైనా చెప్పినట్లు వినకపోవచ్చు.