కేఏ పాల్‌ ఆస్తుల వెనుక భారీ కుంభకోణం?

కేఎ పాల్ అంటేనే ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం.  ఆయనకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో తెలియని విషయం. కేఎ పాల్ విద్య, వైద్యం ముసుగులో మత మార్పిడులు చేస్తున్నారనే ఆరోపణలు ఆయనపై గతంలో ఉండేవి. పెద్ద ఎత్తున నిధులు ట్రస్టు రూపంలో వస్తే కేవలం 5 శాతం వాటిని ఖర్చు చేసి మిగతా 95 శాతంతో సొంతంగా ఛార్టెడ్ ఫ్లైట్స్, ఇబ్బడి ముబ్బడిగా ఆస్తులు సంపాదించుకున్నట్లు  కేఏ పాల్ పై  ఆరోపణలు ఉన్నాయి.  కిలారి ఆనంద్ రావు అలియాస్ కేఏ పాల్  మొదట జూట్ మిల్లులో కార్మికుడిగా పని చేసి, ఆ తర్వాత డ్రైవర్ గా పని చేశారు. విదేశాల నుంచి వచ్చిన క్రిస్టియన్ ప్రతినిధులను అరుకు లోయ సందర్శించడానికి తీసుకెళ్లేవాడని తెలుస్తోంది.

అనంతరం జరిగిన పరిణామాలతో వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారు. చార్టెడ్ ఫ్లైట్లలో తిరిగారు.  తర్వాత ఆస్తులు ఏమయ్యాయి. ఎక్కడికి పోయాయి. వేల ఎకరాల భూములు ఎక్కడికి వెళ్లాయి.  అయితే వేల ఎకరాల్లో కాకుండా కొన్ని వందల ఎకరాల భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు కేఏ పాల్ సోదరుడి పేరు మీద ఉండేవి. అతను హత్యకు గురయ్యాడు. తర్వాత భూముల అంశం వివాదంగా మారింది.

ప్రపంచ వ్యాప్తంగా కేఏ పాల్ కు ఎక్కువ పేరు తెచ్చిన అంశం క్యూబా వివాదం. దీని పరిష్కారంలో కేఏ పాల్ కీలక పాత్ర పోషించడంతో అమెరికా వైట్ హౌస్ లోకి కూడా ప్రవేశించగలిగాడు. కేఏ పాల్ సోదరుడి హత్య తర్వాత ఆయన భూములు, ఆస్తుల వ్యవహారం 10, 12 మంది ఆయన అనుచరులు చూసుకునేవారు. ఇప్పుడేదో కమెడియన్ మాటలు మాట్లాడుతున్నారని ఆయన్ని అందరూ చిన్న చూపు చూస్తున్నారు. కానీ  ఆయన ఆస్తుల పై అంతర్జాతీయంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని, కేఏ పాల్ ఆస్తుల వెనక అతి పెద్ద కుంభకోణం ఉందని  మేధావులు ఆరోపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: