అఖండ 2 కోసం పవిత్ర సంకల్పం బోయపాటి–తమన్ మల్లన్న ఆశీర్వాదం తీసుకున్నారట..!
‘అఖండ 2’ కోసమేనా?
ప్రస్తుతం బోయపాటి శ్రీను.. నందమూరి బాలకృష్ణతో కలిసి ‘అఖండ 2’ సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. ఈ సీక్వెల్కు కూడా తమనే సంగీత దర్శకుడు. ‘అఖండ’ సినిమాకు తమన్ ఇచ్చిన నేపథ్య సంగీతం, శివతాండవం పాట.. ప్రేక్షకులకు మాస్ పూనకాలు తెప్పించాయి.ఇప్పుడు వీరిద్దరూ కలిసి శ్రీశైలం మల్లన్న ఆలయాన్ని దర్శించడం.. ‘అఖండ 2’ సక్సెస్ కోసం, ఈ సీక్వెల్‘అఖండ 2’ను మించి మాస్ విధ్వంసం సృష్టించాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు, ఆశీస్సులు తీసుకున్నారని అభిమానులు భావిస్తున్నారు.
1000 కోట్ల విజన్: ‘అఖండ 2’ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని, దాని ద్వారా 1000 కోట్ల టర్నోవర్ సాధించాలనేది వీరి బిగ్గెస్ట్ విజన్! అందుకే.. ఆ విజయం కోసం స్వామివారిని దర్శించుకుని, ఆశీస్సులు తీసుకున్నారని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేవుడి ఆశీస్సులు, మాస్ ప్లానింగ్ రెండూ తోడైతే.. ఈ విజయం ఖాయమని వారి నమ్మకం. ఆలయాన్ని దర్శించినప్పుడు బోయపాటి శ్రీను గారు, తమన్ ఇద్దరూ చాలా సాంప్రదాయబద్ధంగా, భక్తి భావంతో కనిపించారు. తమ సినిమాల్లో మాస్ పవర్ను చూపించే ఈ ఇద్దరు.. నిజ జీవితంలోనూ భక్తి, నిబద్ధతతో ఉంటారని ఈ సందర్శన రుజువు చేసింది.
బోయపాటి-తమన్ కాంబినేషన్ రాబోయే చిత్రాల కోసం ఫ్యాన్స్ మాస్ పూనకాలతో ఎదురుచూస్తున్నారు. శ్రీశైలం మల్లన్న ఆశీస్సులు వీరి ‘అఖండ 2’ ప్రాజెక్ట్కు బిగ్గెస్ట్ బూస్ట్ ఇవ్వడం ఖాయం!