బీఆర్ఎస్ కోసం కేటీఆర్ యాక్షన్ ప్లాన్ రెడీ?
వచ్చే ఎన్నికలకు గులాబీ సైన్యం సమరోత్సాహంతో కదంతొక్కాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ నెల 25వ తేదీన జరగబోయే ప్రతినిధుల సభలు రాబోవు ఎన్నికలకు బలమైన పునాదిరాళ్లని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మారిన తెలంగాణ ముఖచిత్రంపై సభల్లో తీర్మానాలు చేయాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు.
దేశంలో కేసిఆర్ అంటే సంక్షేమం.. మోదీ అంటే సంక్షోభమని ప్రధాన మంత్రిపై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. దేశప్రజలకు మన ముఖ్యమంత్రి, పిరమైన ప్రధానికి మధ్య వ్యత్యాసాన్ని వివరించాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. మోదీ అంటే మొండిచెయ్యి అన్న నినాదం..ప్రతి గడపకు చేరాల్సి ఉందని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
ఈ నియోజకవర్గ పార్టీ ప్రతినిధుల సభలో కనీసం 6 రకాల తీర్మానాలు చేయాలని.. అందులో ప్రధానంగా వ్యవసాయం, సంక్షేమం, పల్లె ప్రగతి- పట్టణ ప్రగతి, విద్య- ఉపాధి, బిజెపి వైఫల్యాలు, స్థానిక అంశాలపై తీర్మానాలు ఖచ్చితంగా ఉండాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.
ప్రతినిధుల సభలో చేసే తీర్మానాలు ప్రజలను ఆలోచింపజేసేలా ఉండాలని.. నియోజకవర్గ ప్రతినిధుల సభల ద్వారా నాలుగు లక్షల మంది పార్టీ శ్రేణులకు అన్ని అంశాలపైన రాజకీయంగా దిశానిర్దేశం చేసేలా ప్రణాళిక సిద్ధంచేసుకోవాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.