చైనాకు చెక్‌ పెట్టేలా ఆ దేశంలో మోడీ టూర్‌?

చుట్టూ ఉన్న దేశాలకి ఆర్థికంగా సహాయం చేసి తన వైపుకు తిప్పుకోవడం ద్వారా, వాటితో స్నేహం చేయడం ద్వారా మనల్ని ఇబ్బంది పెట్టాలని చైనా  భావిస్తుందని తెలుస్తుంది. అదే సందర్భంలో చైనా చుట్టూ ఉన్న దేశాలతో స్నేహం చేస్తూ చైనా వాళ్ళ వచ్చే ఇబ్బందులను వాళ్ళకి వివరిస్తూ, వాళ్లతో స్నేహం చేస్తూ, వాళ్లకు కావాల్సిన ఆయుధ సామాగ్రిని సప్లై చేస్తూ చైనా చుట్టూ  నరేంద్ర మోడీ ఉచ్చు బిగిస్తున్నట్లు తెలుస్తుంది.

దాంతో నరేంద్ర మోడీ గద్దె తెగ పోతే ప్రమాదం అని భావిస్తుంది చైనా కమ్యూనిస్టు పార్టీ, దానికి అనుబంధంగా భారతదేశంలో నడిచే భారత కమ్యూనిస్టు పార్టీ కూడా నరేంద్ర మోడీని గద్దిదించాలని చూస్తున్నట్లుగా తెలుస్తుంది. వాళ్లు కోరుకునేది ఏంటంటే చైనా పొరపాటున మనపై యుద్ధానికి వచ్చినప్పుడు తప్పేముంది చైనా ఆధీనంలో నడవండి చైనా ఫోన్లు వాడడం లేదా చైనా వస్తువులు వాడటం లేదా, నరేంద్ర మోడీ కన్నా అద్భుతంగా పరిపాలిస్తాడు అని మనల్ని మోటివేట్ చేయడానికి ఇక్కడ ఉన్న వామపక్షాలు సిద్ధమవుతాయి అన్నట్లుగా తెలుస్తుంది. ఈ కుట్ర అనేది ఎలాగూ ఇలాగే జరుగుతుంది.

తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ చైనా అవతల ఉన్న పబ్నా న్యూగినియాలో పర్యటించబోతున్నారు. ఆ దేశమే కాకుండా ఐస్లాండ్, పీజీ కిరిబట్టి, మాస్టర్ ఐలాండ్స్, మైక్రోనేసియా, నియు, నౌరు, సాల్మన్ ఐలాండ్, టోంగా దేశాల నేతలతో కూడా ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం కాబోతున్నారు.

వాళ్లకీ మనకీ మద్య ఉన్న సాంస్కృతిక పరమైన  డీలింగ్స్ ని చెప్పడంతో పాటుగా, ఒకవేళ వాళ్ళు అక్కడ ప్లేస్ ఇస్తే భారత్ కూడా అక్కడ స్థావరాలు ఏర్పరచుకునే విధంగా స్వేచ్ఛని ఇవ్వాలనే కోణంలో, అలాగే ఈ దేశాలన్నిటితో వాణిజ్య, వ్యాపార, రవాణాలు సాగించేటువంటి రూట్ లో సాగిపోతుందంట నరేంద్ర మోడీ విదేశీ టూర్. ఒక రకంగా ఇది చెప్పాలంటే భారత రక్షణ వ్యవస్థకు, దౌత్య విధానానికి పెట్టే అతిపెద్ద పరీక్ష అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: