శభాష్ జగన్: చిన్నారి ప్రాణం కోసం రూ. కోటి సాయం?
ఈ వ్యాధి కారణంగా పాప కాలేయం పని చేయదు. ఇటీవల గోదావరి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా కోనసీమ జిల్లా గంటి పెద్దపూడిలో సీఎం పర్యటించారు. సీఎం తిరుగు ప్రయాణంలో.. హనీ తల్లిదండ్రులు చిన్నారిని కాపాడాలంటూ ప్ల కార్డు ప్రదర్శించారు. ప్లకార్డును చూసిన సీఎం వెంటనే కాన్వాయ్ను ఆపి వారితో మాట్లాడారు. హనీకి సోకిన వ్యాధి, చేయాల్సిన వైద్యం గురించి సీఎం జగన్ ఆరా తీశారు. చిన్నారి ప్రాణాలు నిలిపేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని, ఖర్చు ఎంతైనా పర్వాలేదని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాను సీఎం జగన్ ఆదేశించారు.
ఆ తర్వాత కలెక్టర్ పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం, వాటిని మంజూరుచేసింది. హనీ వైద్యం కోసం కోటి రూపాయలు మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ విషయాన్ని కలెక్టర్ వెల్లడించారు. అమలాపురంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి లో చిన్నారి హనీకి ఇంజక్షన్లను కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ గాకర్స్ వ్యాధి నివారణ కొరకు రాష్ట్ర ప్రభుత్వం 52 ఇంజక్షన్లను మంజూరు చేసింది. ప్రస్తుతం 13 ఇంజక్షన్లను స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి పంపించారు.
ఈ ఒక్క ఇంజక్షన్ ఖరీదు 1 లక్ష 25వేలు. కంపెనీతో మాట్లాడి కలెక్టర్ తెప్పించారు. ప్రతి 15 రోజులకు ఒక ఇంజక్షన్ను, క్రమం తప్పకుండా చిన్నారికి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పాప భవిష్యత్తు విద్య పరంగా కూడా సహాయం అందించాలని సీఎం జగన్ తనను ఆదేశించినట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు.