జూ.ఎన్టీఆర్ ని “ఢీ” కొట్టబోతున్న రోజా..?

Sunil Medarametla

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం ‘RRR’తో బిజీగా ఉన్నారు. లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ మూడు నెలలకు పైగా తాత్కాలికంగా ఆగిపోయింది. షూటింగ్‌లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా భద్రతా కారణాల దృష్ట్యా దర్శకధీరుడు రాజమౌళి ఇంకా షూటింగ్ మొదలుపెట్టలేదు. ఈ సినిమా షూటింగ్‌ను పూర్తిచేసిన తరవాత త్రివిక్రమ్ చిత్రంలో ఎన్టీఆర్ పాల్గొంటారు.

 

ప్రస్తుతం త్రివిక్రమ్ స్క్రిప్ట్‌ కు మెరుగులు దిద్దుతున్నట్టు సమాచారం. ఇప్పటికే త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ‘అరవింద సమేత’ సినిమా వచ్చింది. ఇప్పుడు రెండో సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉంటాయి. దీంతో త్రివిక్రమ్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారట. పాత్రల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని సమాచారం. ఈ క్రమంలోనే బాలీవుడ్ అగ్ర హీరో సంజయ్ దత్ ని విలన్‌గా.. అలాగే  ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్, శృతి హాసన్‌ను హీరోయిన్స్‌ గా ఇప్పటికే ఒకే చేసినట్టు సమాచారం. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ ఒకటి బయటకి వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమా పూర్తిగా పొలిటికల్ నేపధ్యంలో ఉండబోతుందన్న విషయం తెలిసిందే.

 

పైగా ఈ సినిమాలో పొలిటికల్ గా ఒక లేడీ విలన్ క్యారక్టర్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ క్యారక్టర్ సినిమాకి ఎంతో కీలకమైనదంట.. పైగా ఎన్టీఆర్ ను ఢీ కొట్టే విధంగా ఉంటుందట. దీని కోసం ఎంతగానో ఆలోచించిన త్రివిక్రమ్.. రోజా ఐతే కరెక్ట్ అని భావిస్తున్నారట. ఈ మేరకు ఎన్టీఆర్ తో కూడా చర్చించారట. ఇది విన్న వెంటనే ఎన్టీఆర్ కూడా.. ఇలాంటి క్యారెక్టర్ రోజా తప్ప ఎవరూ చేయలేరని చెప్పారట. దీంతో వెంటనే రోజాని, త్రివిక్రమ్ సంప్రదించి.. క్యారెక్టర్ గురించి వివరించారట. తన క్యారెక్టర్ కు ఉన్న ప్రాధాన్యత విన్న వెంటనే రోజా ఒకే చెప్పారట.. పైగా ఎన్టీఆర్ సినిమా కావడంతో ఆమె మరింత ఉత్సాహంగ ఉన్నట్టు తెలుస్తుంది. మరి నిజంగానే రోజా, ఎన్టీఆర్ తో కలిసి నటిస్తున్నారా..? ఇందులో వాస్తవమెంత..? అనే విషయాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: