ఫైర్ బ్రాండ్లు సైలెంట్: వైసీపీలో ఏం జరిగింది...?
వైసీపీలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు తీవ్ర వివాదాస్పదం అవుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కొందరు పదవులపై వ్యామో హంతో సీఎం జగన్ దృష్టిలో పడాలని ప్రయత్నిస్తున్నారని, మరికొందరు తమ హవా నిలుపుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ముఖ్యంగా రాజధాని ప్రాంతానికి చెందిన ఈ ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు కూడా పదవుల వేటలో ముందుకు సాగుతున్నారు. త్వరలోనే రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణ ఉండడంతో గుంటూరు కు చెందిన ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు కూడా ఈ పదవులపై కన్నేశారు. దీంతో వారు జగన్ దృష్టిలో పడేందుకు నానా హంగామా చేస్తున్నారని అంటున్నారు. ఇటీవల కాలం లో ఓ ఎమ్మెల్యే అతి చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఇక, మరో మహిళా ఎమ్మెల్యే సీనియర్లను పక్కన పెట్టి అన్నీ తానే అయి వ్యవహరించడం, ఎంపీలతోనూ రగడకు దిగ డం వంటివి వివాదానికి దారితీశాయి. దీంతో ఆయా నియోజకవర్గాల్లో వీరి పేర్లు మార్మో గుతున్నాయి. ఈ పరిణామాలతో అసలు వీరు ఏం చేస్తున్నారనే విషయం చర్చకుదారితీస్తోంది. ఇక, పురుష ఎమ్మెల్యేల విషయానికి వస్తే.. కొందరు దూకుడుగా ఉండి జగన్ దృష్టిలో పడేందుకు ప్రయ త్నిస్తున్నారు. మరికొందరు మాత్రం సైలెంట్గా ఉండి తమ పనితాము చేస్తున్నారు. ఈ రెండు వర్గాల్లోనూ వివాదం సాగుతూనే ఉంది.
అతిగా స్పందించడం లేదంటే.. పూర్తిగా మౌనం పాటించడం అనే రెండు విష యాల్లోనూ పార్టీ తీవ్రంగా నష్టపోతోందనేది దిగువ శ్రేణి నేతల వాదన. మొత్తంగా చూస్తే.. వైసీపీలో ఎమ్మె ల్యేల వైఖరి తీవ్ర వివాదాస్పదంగా మారుతోందని అంటున్నారు పరిశీలకులు. కొందరు జగన్ కనుసన్నల్లో ఉంటే.. మరికొందరు అతి చేస్తున్నారని, పదవులపై వ్యామోహంతో వ్యవహరిస్తున్నారని అంటున్నా రు. నిజానికి గుంటూరు నుంచి గెలిచిన ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలకు పెద్దగా రాజకీయ అనుభవం లేదు. అయినాకూడా అంతా తామే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వారిద్దరూ కూడా నియోజకవర్గంలోనే కాకుండా పార్టీపైనా ఆధిపత్య ధోరణితో ముందుకు సాగుతున్నారు. ఈ పరిణామాలను గమనిస్తున్న వారు విస్తుపోతున్నారు.
వీరిద్దరు కూడా ఎంతో సౌమ్యంగా వచ్చి.. ఇప్పుడు పార్టీలోనే పెద్ద విపత్తుగా మారారా? అనే చర్చ సాగుతోంది. ఇదిలావుంటే.. ఇప్పుడు వైసీపీలో ఫైర్ బ్రాండ్లుగా ముద్ర వేయించుకున్న వారంతా కూడా మౌనం పాటిస్తున్నారు. ఎక్కడా ఎవరూ కూడా మాట్లాడడం లేదు. పైన చెప్పుకొన్న ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు కూడా సైలెంట్ అయిపోయారు. దీనికి ప్రధాన కారణం అతి చేస్తే.. అసలుకే ఎసరు వస్తుందనే సంకేతాలు వారికి అందడమే కారణమని తెలియడంతోనేనని ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా.,. మౌనం వెనుక కూడా ఏదో మతలబు ఉందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.