అమెరికా కంటే ఇండియానే బెటరంటున్న ఆస్ట్రేలియా?

అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ కలిసి అకూస్ అనే పేరుతో ఏర్పడ్డాయి. క్వాడ్ అనే పేరుతో భారత్, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్ నాలుగు దేశాలు కలిసి చైనాకు పోటీగా రూపొందించాయి. వీటి లక్ష్యం చైనా వన్ రోడ్ వన్ నేషన్ అనే దానికి పోటీకి తీసుకొచ్చిన విధానమే క్వాడ్. ఈ క్వాడ్ లో ఉన్న దేశాలు పరస్పరం సహకరించుకుంటూ ఆర్థిక పరంగా బలంగా తయారు కావడం.

అయితే బైడెన్ వచ్చిన తర్వాత అకూస్ ను ఏర్పాటు చేశారు. క్వాడ్ ను ట్రంపు హాయాంలో ఏర్పాటు చేస్తే బైడెన్ వచ్చిన దాన్ని పక్కన పెట్టేశారు. అకూస్ పెట్టి ఆస్ట్రేలియా వ్యాపారాన్ని అమెరికా లాగేసుకుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఇటీవల భారత్ లో పర్యటించారు. ఈ పర్యటన లో భాగంగా ఆస్ట్రేలియా ప్రధానమంత్రి భారత ప్రధాని మోఢీతో గంటన్నర సేపు సమావేశమయ్యారు.

అమెరికాను నమ్ముకున్న వారు ఎవరూ బాగుపడలేదు. ఇరాక్, ఇరాన్, పాకిస్థాన్, ఆఫ్గానిస్తాన్ లాంటి దేశాలు అమెరికాను నమ్ముకుని ఇప్పటికే తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. కానీ అమెరికాను దూరం పెట్టకుండా ఉండలేం. దూరం పెట్టినా, దగ్గరకు తీసుకున్న ప్రమాదమే. ఇదే సమయంలో భారత ప్రధాని మోఢీ అమెరికాతో, రష్యాతో దౌత్య పరమైన సంబంధాల విషయంలో ఏ మాత్రం తగ్గకుండా వ్యవహరిస్తున్నారు.

ఇలా ఉండటం ఇండియాకే చెల్లింది. ఏ దేశమైన అమెరికా చెప్పినట్లు వినకపోతే.. దాని అంతు చూడకుండా ఉండని అమెరికాకే మోఢీ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తూ ఝలక్ ఇస్తున్నాడు. ఈ సమయంలో ఆస్ట్రేలియా ప్రధాని, మోఢీతో సమావేశం కావడం అనేది చర్చనీయాంశంగా మారింది. ఆస్ట్రేలియా ప్రధాని ఎక్కువగా విదేశాంగ విధానాల గురించి చర్చించనట్లు తెలుస్తోంది. భారత్ వద్ద కొన్ని సలహాలు కూడా తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.  గతంలో అగ్రరాజ్యం చెప్పినట్లు వినే పరిస్థితిలో నుంచి దాన్ని ఎదిరించి నిలబడుతోందంటే నరేంద్ర మోఢీ దృఢమైన పాలనే కారణమని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: