కాశ్మీర్లో హిందువులపై దాడులు.. అంతం లేదా?
ఒక పక్కన ఎక్కడికక్కడ తీవ్రవాదులను తుడిచిపెట్టుకుంటూ వెళుతూ ఉంటే వాళ్లు మాత్రం సరికొత్త పరిజ్ఞానాన్ని వాడుకుంటూ ఆయుధాలను సమకూర్చుకుంటున్నారు. డ్రోన్ల సహాయంతో వారు ఆయుధాల్ని సమకూర్చుకుంటున్నట్టు తెలుస్తోంది. అప్పటికీ వాటిని కూడా ఉగ్రవాదులకు అందకుండా చాలావరకు కట్టడి చేస్తున్నారు. జరిగిన దుర్ఘటన విషయంలో పోలీసులు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపడుతుండగా, మరోపక్క ఉగ్రవాదులు మరొక దాడిని చేశారు. రాజోరి సెక్టర్ లో ఐఐడి బాంబులు పెట్టి పేల్చివేసిన నేపథ్యంలో నలుగురు గాయపడగా, ఒక చిన్న బాలుడు చనిపోయాడు. మరొక వైపు కాశ్మీర్ లో ముస్లిమేతరులు ఉండకూడదనే దుష్ట ఆలోచనతో హిందువుల ఇళ్ళను వాళ్ళు బాంబులు పెట్టి పేల్చివేస్తున్నారు.
వేర్పాటు వాదుల ప్రభుత్వం ఉన్నప్పుడూ లేదా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు.. భారతీయ జనతా పార్టీ వారు గానీ, అనుబంధ సంస్థలు గానీ భారీ ఆందోళనలు చేపట్టేవారు. కానీ ఇప్పుడు కేంద్రంలో ఉన్నది తమ ప్రభుత్వమే అయ్యేసరికి స్పందించడానికి కూడా ఆలోచిస్తూ మౌన వైఖరిని అవలంబిస్తున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్లు. అక్కడ ఎంత మంది హిందువులని చంపేస్తున్నా మానవ, పౌర హక్కుల సంఘాలు ఎవరు నోరు మెదపరు. చివరికి హిందూ జాతికి రక్షకులమని, హిందూ జాతిని ఉద్ధరించే వాళ్ళమని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ కూడా అక్కడి హిందువులను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.