సొంత వ్యాక్సీన్లే చైనా కొంప ముంచాయా?
సాధారణంగా కరోనా వచ్చిన వ్యక్తికి రెండు ఏళ్ళ దాకా తిరిగి కరోనా రాదు. ఎందుకంటే బాడీలో వ్యాక్సిన్ ద్వారా వచ్చిన ఇమ్యూనిటీ , వైరస్లతో పోరాడుతూ ఉండడమే దానికి కారణం. చైనాలో కరోనా వ్యాక్సిన్ కోసం డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం లేక చాలామంది వ్యాక్సిన్లు వేయించుకోలేదు. అక్కడ జనాల్ని కరోనా భయంతో నిర్బంధంలో పెట్టడం వల్ల కూడా ఈ హెర్డ్ ఇమ్యూనిటీ అనేది వాళ్ళలో పడిపోయింది. భారత్ టీకాలు అన్ని డోసులు వేయించుకున్న వాళ్లకు 99.3% అవి వాళ్లపై సమర్థంగా పనిచేస్తాయి.కానీ చైనా టీకాలకు ఆ సరైన సామర్థ్యం లేకపోవడంతో ఆ టీకా వేయించుకున్న వాళ్ళు పదేపదే కరోనా బారిన పడుతున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా టీకాలకు సమర్థత 79% ఉందంటే కాదు హాంకాంగ్ యూనివర్సిటీ అధ్యయనం అది 60 లోపే అని తేల్చేసింది. ఆసియా లైఫ్ పత్రిక ప్రకారం జర్మనీ వ్యాక్సిన్ ఫైజర్ బయో ఎమ్టెక్ కన్నా చైనా వ్యాక్సిన్ వాడేవాళ్ళలో మరణించే అవకాశాలు మూడు రెట్లు ఎక్కువ ఉన్నట్లు తేలింది. కరోనా వ్యాధి వల్ల వ్యాధి నిరోధక యాంటీ బాడీలు సగానికి సగం తగ్గిపోయాయని థాయిలాండ్ పరిశోధనల్లో తేలింది. మొత్తానికి చైనాను తాను చేసుకున్న పాపం వెంటాడుతూనే ఉంది.