రేప్‌ చేసి.. ఘోరంగా చంపి 15 ఏళ్లు.. న్యాయం ఎప్పుడు?

ఆయేషా మీరా అత్యాచారం, హత్య జరిగి 15యేళ్లు పూర్తవుతున్నా.. తమ కుటుంబానికి న్యాయం దక్కలేదని ఆమె తల్లి శంషాద్ బేగం అంటున్నారు. నిజమైన హంతకులను శిక్షించాలంటూ...  న్యాయం కై ఇంకెన్నాళ్లు పేరుతో ఆయేషా మీరా తల్లి శంషాద్ బేగం సమావేశం నిర్వహించారు. అయేషా హత్య కు గురై 15యేళ్లు అయ్యిందని.. ఐపియస్ అధికారులు ఆనంద్,  ప్రస్తుత డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి కేసును తప్పు దోవ పట్టించారని ఆయేషా మీరా తల్లి శంషాద్ బేగం ఆరోపిస్తున్నారు.

ఈ కేసులో సత్యం బాబు ను అరెస్టు చేసినా కోర్టు లో దోషిగా నిర్ధారించ లేదని ఆయేషా మీరా తల్లి శంషాద్ బేగం గుర్తు చేశారు. 2018 డిసెంబరు లో కేసు సిబిఐ స్వీకరించిందని.. సికింద్రాబాద్ తీసుకెళ్లి మాకు డి.యన్.ఎ టెస్ట్ చేయించారని.. మా దగ్గర ఉన్న అన్ని వివరాలు సిబిఐ కి ఇచ్చామని ఆయేషా మీరా తల్లి శంషాద్ బేగం గుర్తు చేశారు. మా మత పెద్దలు  రీ పోస్ట్ మార్టం కు అంగీకరించ లేదని.. కానీ ఆ తరువాత కోర్టు ఆదేశాలతో రీ పోస్ట్ మార్టం చేశారని.. మూడేళ్లుగా మా పాప శరీర భాగాలు కూడా వెనక్కి ఇవ్వలేదని ఆయేషా మీరా తల్లి శంషాద్ బేగం వాపోయారు.

చివరకు సిబిఐ కూడా అవినీతి మయం అయిపోయిందన్న ఆయేషా మీరా తల్లి శంషాద్ బేగం.. అందుకే మేము సుప్రీంకోర్టు లొ న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. అసలైన దోషులకు శిక్ష పడి,  న్యాయం జరిగే వరకూ ముందుకు సాగుతామని ఆయేషా మీరా తల్లి శంషాద్ బేగం అన్నారు. వైయస్ సిఎంగా ఉన్న సమయంలో అయేషా హత్య జరిగిందని.. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నిర్భయ  తరహాలో అయేషా పేరుతో చట్టం చేయాలని ఆయేషా మీరా తల్లి శంషాద్ బేగం డిమాండ్ చేశారు. నేరస్థులు కు శిక్ష పడేలా ప్రభుత్వం వైపు సహకారం అందించాలని ఆమె కోరారు.

అయేషా హత్య పై న్యాయ పోరాట సమితి పేరుతో పోరాటం చేస్తున్నామని.. 2007లో చనిపోయిన నాటి నుంచి  2019వరకు అనేక శాఖ ల అధికారులు దర్యాప్తు చేశారని.. సిబిఐ విచారణ చేసినా దోషులు పట్టుకోలేక పోయారని.. వారు ఎవరి ఒత్తిడులకు లొంగారో తేల్చాలని ఆయేషా మీరా తల్లి శంషాద్ బేగం డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు లో పోరాటం చేయాలని నిర్ణయించామని.. ప్రజా సంఘాలు కూడా మా పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నామని ఆమె అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: