కాంగ్రెస్‌ స్ఫూర్తితో.. మోడీ భారీ స్కామ్‌కు ఛాన్స్‌ ఇస్తున్నారా?

Chakravarthi Kalyan
ఒకప్పుడు ప్రతి పక్ష హోదాలో ఏదైతే తప్పు అని వాదించిందో.. ఇప్పుడు ప్రభుత్వ హోదాలో అదే విధానం కావాలని అంటోంది. 2జీ స్పెక్ట్రమ్  కేటాయింపులపై 2012లో ఇచ్చిన తీర్పును సవరించాలని 12 ఏళ్ల తర్వాత సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్ర ప్రభుత్వం విజ్ఙప్తి చేసింది. వేలం విధానంలో కాకుండా తామే కేటాయింపులు జరుపుతామని కోర్టుకి తెలిపింది.

వేలం ద్వారా మాత్రమే కేటాయింపులు జరపాలంటూ ఇచ్చిన తీర్పును సవరించాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థీవాలాల ధర్మాసనం ఎదుట కేంద్రం తరఫున  అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి అభ్యర్థించారు. ఈ అంశంపై తక్షణం విచారణ చేపట్టాలని కోరారు. ఫస్ట్ కం ఫస్ట్ బేసిస్( ముందు వచ్చిన వారికే ప్రాధాన్యం) పద్దతిలో యూపీఏ హయాంలో ఏ.రాజా టెలికం మంత్రిగా ఉన్నప్పుడు 2జీ స్పెక్ట్రమ్ కు సంబంధించి కంపెనీలకు ఇచ్చిన 122 లైసెన్సులను రద్దు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పునివ్వడం తెలిసిందే.

కొన్ని సందర్భాల్లో వేలంలో కాకుండా ప్రభుత్వమే కేటాయింపులు జరపాలని ఆశిస్తోందని.. అందుకే పాత తీర్పును సవరించాలని అటార్నీ జనరల్ కోరారు. ఈ విషయాన్ని పరిశీలిస్తామని, వివరాలను ఈ మెయిల్ లో పంపాలని సీజేఐ చంద్రచూడ్ సూచించారు. అయితే తీర్పును సవరించాలంటూ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషన్ తప్పుపట్టారు. నాటి తీర్పు సమంజసంగానే ఉందని ఆయన వాదించారు.

నాడు యూపీఏ సర్కారుకు వ్యతిరేకంగా 2జీ స్పెక్ట్రమ్ పై ఎన్జీవో సంస్థ తరఫున ప్రశాంత్ భూషణే వాదించారు. కేటాయింపుల వల్ల ప్రభుత్వ ఖజానాకు ఎలాంటి నష్టం వాటిల్లదేదని మన్మోహన్ హయాంలో నాటి ఐటీ మినిస్టర్, కపిల్ సిబల్ వాదించారు. అయితే ఈ కేసులో డీఎంకే నాయకురాలు కనిమెళి, ఏ రాజాలను నిర్దోషులుగా ప్రకటిస్తూ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. దీనిని సవాల్ చేస్తూ సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది. అక్రమ కేటాయింపుల వల్ల ఖజానాకు రూ.30,984 కోట్ల నష్టం వాటిల్లిందని వాదించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: