షాకింగ్: పవన్ కల్యాణ్పై పందేల జోరు?
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుంది. టీడీపీ కి వచ్చే సీట్ల సంఖ్య ఎంత. ఇలాంటి అంశాల చుట్టూనే ప్రస్తుతం జోరుగా పందేలు సాగుతున్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ 70కి మించి స్థానాలు రావని కొందరు కాస్తుంటే.. మరికొందరు… చంద్రబాబు కుప్పంలో ఓడిపోబోతున్నారు అని కాస్తున్నారు. ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీలు చేసే ఖర్చులకు పదింతలు డబ్బు బెట్టింగ్ రూపంలో పెడుతున్నారు.
ఏపీ ఫలితాలపై ఒక్క ఏపీలోనే కాకుండా.. తెలంగాణ, కర్ణాటక, తమిళ నాడు, మహారాష్ట్ర లో సైతం వేలమంది పందేలు కాస్తున్నారు. ఏపీలో బెట్టింగ్ లకు పేరొందిన ఉభయ గోదావరి జిల్లాలతో పాటు.. గుంటూరు, కృష్ణా లో కూడా ఇప్పటికే పందేలు ప్రారంభం అయ్యాయి. ఇప్పుడు ఇది తారా స్థాయికి చేరింది. పిచ్చి పలు రకాలు అన్నట్లు ఇప్పుడు గెలుపోటములపై కాకుండా పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు.. ఎన్ని స్థానాల్లో బరిలో ఉంటారు అనే అంశాలపై కూడా బెట్టింగ్ లు కాస్తున్నారు అంట.
అయితే సులభంగా సంపాదన పేరుతో బెట్టింగ్ లకు కొంతమంది అలవాటు పడుతున్నారు. పందేలు కాసి సర్వం కోల్పోయి ప్రాణాలు కోల్పోయిన వారు చాలామందే ఉన్నారు. కాబట్టి బెట్టింగ్ లో డబ్బులు పోగోట్టుకోకుండా వాటిని పిల్లల అభివృద్ధి కోసం.. కుటుంబం సంక్షేమం కోసం ఖర్చు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే కుటుంబంతో కలిసి విహార యాత్రలకు వెళ్లి రావాలని సూచిస్తున్నారు. అంతే కానీ జూదంలో ఇరుక్కుపోయి కుటంబాన్ని రోడ్డు మీదకి లాగొద్దంటూ పలువురు హెచ్చరిస్తున్నారు.